Loading...
Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' ప్రారంభం
'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' ప్రారంభం

Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్‌ఎస్‌సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యాచరణను అమలు చేయనుంది. మొదటి దశలో ఈ నెల 13 నుంచి నవంబర్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పబ్లిక్ పరీక్షలకు సమర్థంగా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

విద్యా పునాదిని బలోపేతం చేయడంపై ఉపాధ్యాయుల దృష్టి

ఈ కార్యక్రమానికి అవసరమైన రోజువారీ బోధన షెడ్యూల్, ప్రశ్నల బ్యాంకులు, అధ్యయన మెటీరియల్, ప్రత్యేకంగా రూపొందించిన స్లిప్ టెస్ట్ ప్రశ్నపత్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఆన్‌లైన్ ద్వారా పాఠశాలలకు అందజేయనుంది.

వీటి ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధన చేపడతారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకుని వారిని 'రైజింగ్ స్టార్స్','షైనింగ్ స్టార్స్' అనే రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు.

'రైజింగ్ స్టార్స్'లోని విద్యార్థులకు కనీస అభ్యసన నైపుణ్యాలు మెరుగుపడేలా, ప్రాథమిక అంశాలపై పట్టు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధతో బోధన అందిస్తారు.

వారి విద్యా పునాదిని బలోపేతం చేయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారిస్తారు.

వివరాలు 

విద్యా సహాయాన్ని అందించేలా కార్యాచరణ

ఇక 'షైనింగ్ స్టార్స్'లోని ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత స్థాయి అభ్యసన సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక శిక్షణ అందిస్తారు.

విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనుకబడిన వారికి అదనపు బోధన, ప్రతిభావంతులకు తగిన మార్గదర్శకత్వం కల్పిస్తారు.

అలాగే ప్రతి విద్యార్థి పురోగతిని క్రమబద్ధంగా నమోదు చేస్తూ, అవసరమైన విద్యా సహాయాన్ని అందించేలా కార్యాచరణ కొనసాగించనున్నారు.

ADVERTISEMENT