NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 
    తదుపరి వార్తా కథనం
    Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 
    ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై

    Tamilnadu: ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయం.. కొరడాతో శిక్షించుకున్న అన్నామలై 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 27, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డీఎంకే, బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత వేడెక్కింది.

    ఈ క్రమంలో, రాష్ట్రంలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది.

    ఈ సంఘటనతో అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    దీంతో, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    ఆయన ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. ఈ చర్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యిన  వీడియో 

    TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.
    He has vowed to walk barefoot until the DMK govt falls.

    Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu

    — Mr Sinha (@MrSinha_) December 27, 2024

    వివరాలు 

    డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను: అన్నామలై

    తమిళనాడులో శాంతి భద్రతలపై అన్నామలై తీవ్ర ఆరోపణలు చేసారు.

    ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి, మురుగన్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు.

    ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని తెలిపారు.

    శుక్రవారం, కోయంబత్తూరులోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    ముందుగా, తమిళనాడులో డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోనని అన్నామలై చేసిన శపథం తెలిసిందే.

    ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో డీఎంకే అరాచక పాలన సాగిస్తోందని, దీనిపై నిరసనగా 48 రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

    వివరాలు 

    అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు 

    ఇదిలా ఉండగా, ఇటీవల తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

    ఈ ఘటనకు సంబంధించి, వేధించిన వ్యక్తి జ్ఞానశేఖరన్ డీఎంకే కార్యకర్త అని, అతని డీఎంకే నేతలతో ఉన్న ఫొటోలు మీడియాలో బయటపడ్డాయి.

    ఈ కారణంగా, పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.

    డీఎంకే పాలనలో శాంతిభద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తమిళనాడు

    Tamilanadu: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతినెలా వెయ్యి రూపాయలు భారతదేశం
    Tamilnadu: ఎన్‌సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్ భారతదేశం
    Manu Bhaker :తమిళనాడు సీఎం ఎవరో తెలియదు.. వైరల్‌గా మారిన మను భాకర్ సమాధానం  క్రీడలు
    Thalapathy Vijay: తలపతి విజయ్ రాజకీయ ప్రవేశం..  పార్టీ జెండా, గీతాన్ని ఆవిష్కరించిన 'లియో' స్టార్  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025