Page Loader
Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత
ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!

Andhra news: ఏపీకి రూ.10 వేల కోట్లతో అతిపెద్ద సౌర ప్రాజెక్టు!.. ప్లాంట్‌ పెట్టడానికి రిలయన్స్‌ ఎన్‌యూ సన్‌టెక్‌ సంసిద్ధత

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 16, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో 930 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్,465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి ప్రాజెక్టును ప్రారంభించేందుకు రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్‌ తాజాగా కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలను పరిశీలించింది. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా 1,000మందికి ప్రత్యక్ష ఉపాధి,5,000మందికి పరోక్ష ఉపాధి కల్పించనుంది. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది సెకి సంస్థతో కలిసి చేపట్టబడుతుంది. 25 సంవత్సరాల పాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఉత్పత్తి చేసే విద్యుత్తును దేశంలోని వివిధ పంపిణీ సంస్థలకు సరఫరా చేయడం లక్ష్యం.ఈప్రాజెక్టు బిల్డ్-ఓన్-ఆపరేట్(బీఓటీ)విధానంలో ఏర్పాటయ్యేలా ఉంది.