NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా? 

    నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Mar 05, 2024
    06:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.

    ఈ సొసైటీలో నీటి సంరక్షణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించడమే కాకుండా.. నీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తోంది.

    వర్షాభావ పరిస్థితుల కారణంగా బెంగళూరు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది.

    ఇక్కడ బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. ట్యాంకర్ల సాయంతో బెంగుళూరు వాసులకు నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి నెలకొంది.

    ఈ క్రమంలో నీటిని ఎద్దడిని అరికట్టేందుకు హౌసింగ్ సొసైటీ తీసుకున్న చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు.

    బెంగళూరు

    భవిష్యత్‌లో నీటికోత మరింత పెరిగే అవకాశం

    బెంగళూరులో అత్యంత నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 'పామ్ మెడోస్ సొసైటీ' ఒకటి.

    గత 4 రోజులుగా బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB) నుంచి నీరు అందడం లేదు.

    దీంతో నీటి ఎద్దడిని తెలియజేసేందుకు, అలాగే పరిష్కార మార్గాన్ని చూపుతూ.. 'పామ్ మెడోస్ సొసైటీ' నివాసితులకు నోటీసు జారీ చేసింది.

    నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి.. ప్రతి ఇంట్లో నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించింది.

    20శాతం తక్కువగా నీటిని వినియోగించకుంటే రూ.5,000 జరిమానా విధించాల్సి ఉంటుందని సొసైటీ పేర్కొంది.

    ఇదే కాకుండా, నీటి సరఫరాలో రానురాను కోత పెరగవచ్చని తెలిపింది. వేసవి నెలల్లో కోత 40 శాతం వరకు పెంచనున్నట్లు వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ అత్యాచారం
    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తున్నారా? బెంగళూరు దగ్గర్లోని చూడాల్సిన ప్రదేశాలు ఇవే  పర్యాటకం
    చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్  చంద్రయాన్-3
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  రైలు ప్రమాదం

    తాజా వార్తలు

    Rameshwaram blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య  బెంగళూరు
    IT Raids: పొగాకు వ్యాపారి ఇంట్లో రూ.50 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం  మమతా బెనర్జీ
    మార్చి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025