బిహార్: ప్రశాంత్ కిషోర్కు గాయం; 'జన్ సూరాజ్' పాదయాత్రకు విరామం
వ్రాసిన వారు
Stalin
May 15, 2023
06:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గాయం కారణంగా బిహార్లో ఆయన నిర్వహిస్తున్న జన్ సూరాజ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. వైశాలి జిల్లాలో తన పాదయాత్రలో తన ఎడమ కాలుకు నొప్పి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ విలేకరుల సమావేశంలో చెప్పారు. చాలా దూరం నడవడం వల్ల కండరాలు దెబ్బతిన్నాయని వైద్యు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్రను 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. తనకు ఇతర ఆరోగ్య సమస్యలు లేవని, అధ్వాన్నమైన రోడ్లపై ఎక్కువ దూరం నడవడం వల్ల కండరాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి