Page Loader
Bihar: రైల్వే ట్రాక్‌పై పబ్జి … బిహార్‌లో ముగ్గురు యువకుల దుర్మరణం
రైల్వే ట్రాక్‌పై పబ్జి … బిహార్‌లో ముగ్గురు యువకుల దుర్మరణం

Bihar: రైల్వే ట్రాక్‌పై పబ్జి … బిహార్‌లో ముగ్గురు యువకుల దుర్మరణం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 03, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ రాష్ట్రంలో జరిగిన ఓ దుర్ఘటనలో, రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్న ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పట్నా నగరంలోని పశ్చిమ చంపారన్ జిల్లాకి చెందిన వారు. నార్కటియాగంజ్-ముజఫర్‌పుర్ రైల్వే మార్గంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, అదే మార్గంలో వచ్చిన రైలు వారిపై దూసుకువెళ్ళింది. ఈ సంఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని ఉండడంతో, రైలు వస్తున్నట్లు గమనించలేకపోయారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను ఫర్కాన్‌ ఆలం, సమీర్‌ ఆలం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు.

వివరాలు 

బహిరంగ ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలి 

పోలీసులు సంఘటనపై పోస్ట్‌మార్టం పూర్తి చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదం తర్వాత, ఆందోళన వ్యక్తంచేసిన పోలీసులు, ఇటువంటి పరిస్థితుల్లో యువకులు సురక్షితం కాని ప్రదేశాలలో పరధ్యానంగాప్రవర్తించడం వల్ల వారి ప్రాణాలు కాకుండా ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం తలెత్తుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు నివారించడానికి, బహిరంగ ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు, అధికారులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు.