English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి
    తదుపరి వార్తా కథనం
    Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి
    మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి

    Nagpur rescue centre: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం.. మూడు పులులు, చిరుత మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 05, 2025
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ గోరెవాడ రెస్క్యూ సెంటర్‌లో మూడు పులులు, ఒక చిరుత బర్డ్‌ ఫ్లూ కారణంగా మరణించాయి.

    డిసెంబర్‌ 2024లో ఈ మరణాల తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. బర్డ్‌ ఫ్లూ సోకిన పులులను చంద్రపూర్‌ నుంచి గోరెవాడకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

    డిసెంబర్‌ 20న ఒక పులి, డిసెంబర్‌ 23న మరో రెండు పులులు చనిపోయాయి. ఈ జంతువుల మరణాల తర్వాత సేకరించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కి పరీక్షల కోసం పంపించారు.

    జనవరి 1న వచ్చిన ల్యాబ్‌ ఫలితాల్లో బర్డ్‌ ఫ్లూ కారణంగానే పులులు, చిరుత మరణించినట్లు నిర్ధారణ అయ్యింది.

    Details

    వన్యప్రాణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

    రెస్క్యూ సెంటర్‌లోని మిగతా 26 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించగా, అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    నిపుణుల అభిప్రాయం ప్రకారం, బర్డ్‌ ఫ్లూ సోకిన ఆహారం లేదా పచ్చి మాంసం తినడం వల్ల ఈ వైరస్‌ జంతువులకు సంక్రమించినట్లు భావిస్తున్నారు.

    మరణాల అనంతరం కేంద్రం పరిధిలో ఉన్న వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి రాకుండా, భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలని అధికారులు సూచించారు.

    రెస్క్యూ సెంటర్‌ యాజమాన్యం, అటవీ శాఖ అధికారులు బర్డ్‌ ఫ్లూ సోకిన ఆహారం సరఫరాపై మరింత నిఘా పెట్టాలని నిర్ణయించారు

    . పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు జంతువుల ఆరోగ్య భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    ఇండియా

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    మహారాష్ట్ర

    Harsh Goenka: ప్రజాస్వామ్యం కోసం సంపన్నులు ఎదురుచూస్తారా..? గోయెంకా వివాదాస్పద పోస్ట్‌! జార్ఖండ్
    #NewsBytesExplainer: మహారాష్ట్రను కుదిపేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్.. అసలు ఈ స్కామ్ ఏంటి ? ఏం జరుగుతోంది? బిట్ కాయిన్
    Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం కాంగ్రెస్
    Exit Polls: మహారాష్ట్ర,జార్ఖండ్‌ల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతోంది? ఎన్నికలు

    ఇండియా

    EPFO: అధిక పింఛనుకు గడువు పెంపు.. పెండింగ్‌లో ఉన్న 3.1 లక్షల దరఖాస్తులకు ఈపీఎఫ్‌ఓ మరో అవకాశం ఈపీఎఫ్ఓ
    Tashi Namgyal: కార్గిల్ యుద్ధంలో పాక్ కుట్రను భగ్నం చేసిన ఆ గొర్రెల వ్యాపారి ఇక లేరు జమ్ముకశ్మీర్
    Alcohol prices: ఏపీలో మద్యం ప్రియులు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గనున్న ధరలు! ఆంధ్రప్రదేశ్
    Tamil Nadu: ఆలయ హుండీలో పడిన ఐఫోన్.. దేవుడి సొత్తుగా ప్రకటించిన ఆలయాధికారులు  తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025