LOADING...
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్‌ ప్లాంట్‌లో పేలుడు.. 9 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్‌ ప్లాంట్‌లో పేలుడు.. 9 మంది మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత పవర్‌ ప్లాంట్‌లో పేలుడు.. 9 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని వేదాంత విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 30 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం కార్మికులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో బాయిలర్‌లో లోపం ఏర్పడడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే భయంతో కార్మికులు బయటకు పరుగులు తీయడానికి ప్రయత్నించడంతో కేంద్రం లోపల తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఈ గందరగోళంలో మరికొంతమంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించి కారణాలను పరిశీలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛత్తీస్‌గఢ్ వేదాంత విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు

Advertisement