NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు
    ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు

    Railway Budget 2025: ఫిబ్రవరి 1న బడ్జెట్.. ఈసారి రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 18, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దేశం మొత్తం ఈ బడ్జెట్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి నెలకొంది.

    రైల్వేలకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధులు వేగంగా వినియోగిస్తున్న కారణంగా రైల్వే బడ్జెట్ 15-20 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    గతంలో రైల్వేలకు రూ.2.65 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి అది రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Details

    80శాతం నిధుల వినియోగం

    ఈ బడ్జెట్‌లో రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్, ఆధునిక రైళ్ల ప్రారంభం, కొత్త ట్రాక్‌ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేయడం, తద్వారా ట్రాఫిక్‌ను తగ్గించడం మాన్యువల్‌గా చర్చించబడే అంశాలు కావచ్చు.

    బడ్జెట్‌లో పెరిగిన రైల్వే నిధులను మౌలిక సదుపాయాల ఆధునీకరణ, లోకోమోటివ్‌లు, కోచ్‌లు, వ్యాగన్ల వంటి అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించవచ్చు.

    ఈసారి పెరిగిన రైల్వే బడ్జెట్‌ను ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ (బుల్లెట్ రైలు ప్రాజెక్టు) పనులను వేగవంతం చేయడంలో వినియోగించే అవకాశం ఉంది.

    గత ఆర్థిక సంవత్సరం రైల్వేకు కేటాయించిన రూ.2.65 లక్షల కోట్లలో 80 శాతం నిధులు ఇప్పటికే వినియోగించారు.

    Details

    20శాతం పెరిగే అవకాశం

    అందుకే ఈసారి బడ్జెట్ 20 శాతం పెరగవచ్చని తెలుస్తోంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రైల్వే బోర్డు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, దీనిని సమీప భవిష్యత్తులో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఒక రైల్వే అధికారి వెల్లడించారు.

    బుల్లెట్ రైలు ప్రాజెక్టును పర్యవేక్షించే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు 2025 ఆర్థిక సంవత్సరానికి రైల్వే రూ.21,000 కోట్లు కేటాయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్
    నిర్మలా సీతారామన్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    బడ్జెట్

    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు ఆర్ధికవేత్త
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి ఆర్థిక సంవత్సరం
    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ తమిళసై ప్రసంగం ఎలా ఉండబోతోంది? తెలంగాణ

    నిర్మలా సీతారామన్

    B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం ఆర్థిక శాఖ మంత్రి
    తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు సనాతన ధర్మం
    చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ
    Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే?  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025