LOADING...
CBSE: మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ
మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ

CBSE: మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 02, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) విద్యార్థుల మార్కుల ధృవీకరణ (Verification of Marks), జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ప్రకటించిన బోర్డు పరీక్షల ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు ఈ పోర్టల్ ద్వారా తమ మార్కులను తిరిగి పరిశీలించుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకునేందుకు సీబీఎస్ఈ ఒక వివరణాత్మక సూచనల వీడియోను కూడా విడుదల చేసింది.

వివరాలు 

పోర్టల్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?

విద్యార్థులు postresult.cbseit.in/pvr/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పరీక్ష టైప్ ఎంపిక చేసుకుని, రోల్ నంబర్,పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ కావాలి. పోర్టల్‌లో మార్కుల ధృవీకరణ,రీ-ఎవాల్యుయేషన్ అనే రెండు సేవలు అందుబాటులో ఉన్నాయి. మార్కుల ధృవీకరణలో సమాధానాలు పరిశీలించకుండా మిగిలిపోయాయా లేదా మార్కుల కూడికలో పొరపాట్లు జరిగాయా అనే అంశాలను తనిఖీ చేస్తారు. రీ-ఎవాల్యుయేషన్‌లో సంబంధిత జవాబు పత్రాన్ని మరోసారి పరిశీలిస్తారు. ప్రతి ప్రశ్న లేదా సబ్జెక్టుకు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము తిరిగి చెల్లించబడదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దశలవారీ సూచనలతో కూడిన CBSE వీడియో

Advertisement

వివరాలు 

సాంకేతిక సమస్యల కారణంగా పోర్టల్ ప్రారంభం వాయిదా పడింది

అయితే ఈ పోర్టల్ ప్రారంభం సాంకేతిక సమస్యల కారణంగా కొంత ఆలస్యమైంది. ముఖ్యంగా ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో తలెత్తిన లోపాలు, చెల్లింపుల వైఫల్యాలు, అధిక రుసుముల కోతలు వంటి సమస్యలు ఎదురవడంతో పోర్టల్ ప్రారంభాన్ని వాయిదా వేశారు. భారీ సంఖ్యలో దరఖాస్తులను సమర్థంగా నిర్వహించేందుకు, పోర్టల్ పనితీరును మరింత స్థిరంగా మార్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టినట్లు సీబీఎస్ఈ తెలిపింది.

Advertisement

వివరాలు 

టెండర్ ప్రక్రియలో అవకతవకలను పరిశీలిస్తున్నమంత్రిత్వ శాఖ

ఇదిలా ఉండగా, ఓఎస్ఎం వ్యవస్థకు సంబంధించిన టెండర్ ప్రక్రియ, మూల్యాంకన మౌలిక సదుపాయాలపై వచ్చిన ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ పరిశీలిస్తోంది. సైబర్ భద్రత నిపుణులు, ఎథికల్ హ్యాకర్లు సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకన వ్యవస్థకు సంబంధించిన కొన్ని భద్రతా లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే అసలు జవాబు పత్రాల మూల్యాంకన వేదిక హ్యాక్ కాలేదని,ప్రచారంలోకి వచ్చిన ఘటనలు కేవలం నమూనా డేటాతో పనిచేసే టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే సంబంధించినవని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.

వివరాలు 

CBSE పునఃమూల్యాంకన రుసుముల పై రాజకీయ స్పందన

మరోవైపు, రీ-ఎవాల్యుయేషన్ రుసుముల అంశం రాజకీయంగానూ చర్చకు దారి తీసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ రుసుములపై విమర్శలు గుప్పించారు. మూల్యాంకన వ్యవస్థపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ మార్కులను ధృవీకరించుకోవడానికి ఎందుకు ఫీజు చెల్లించాలని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలపై విద్యాశాఖ నిశితంగా నిఘా ఉంచినట్లు, ఓఎస్ఎం టెండర్ ప్రక్రియతో పాటు సంబంధిత కార్యకలాపాలపై అంతర్గత సమీక్షను ప్రారంభించినట్లు సమాచారం.

Advertisement