దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్!
వ్రాసిన వారు
Stalin
Mar 11, 2024
05:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని( CAA)ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కుదిరితే సీఏఏ అమలుకు కుదిరితే సోమవారం, లేకుంటే మంగళవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన క్షణం నుంచే దేశంలో CAA అమల్లోకి రానుంది. సీఏఏ బిల్లును చట్టం చేసి.. దాదాపు ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాబోయే లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే దేశంలో సీఏఏను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి