NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..! 
    తదుపరి వార్తా కథనం
    Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..! 
    ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..!

    Parents Property Rights: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కి..! 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ ప్రభుత్వం ఇటీవల తల్లిదండ్రుల హక్కులను కాపాడేందుకు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

    తల్లిదండ్రుల నుంచి ఆస్తి రాసిపుచ్చుకుని వారిని పట్టించుకోని వారసులపై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

    వారు సరిగా చూడడం లేదని భావించిన తల్లిదండ్రులు జిల్లా ట్రిబ్యూనల్ అధికారిగా ఉండే ఆర్డీవోకు పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

    విచారణలో తల్లిదండ్రుల ఫిర్యాదు నిజమని తేలినప్పుడు ఆ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌రిజిస్టార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసిన వారసులు, ఆస్తిపాస్తులు అందుకున్న వెంటనే వారిని నడిరోడ్డుపై వదిలేసి, ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు.

    వివరాలు 

     ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరుపై బదిలీ 

    వారసులు కనీసం ఒక ముద్ద అన్నం పెట్టలేకపోవడం వలన తల్లిదండ్రులు జీవన ముగింపు దశను ఎంతో కష్టంగా గడపాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఆస్తులు రాసిచ్చిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో ఆ ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు తీసుకువచ్చింది.

    2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం, తల్లిదండ్రులు తమ వారసులు సరిగా చూడడం లేదని ఫిర్యాదు చేయవచ్చు.

    విచారణలో ఫిర్యాదు నిజమని తేలితే ఆర్డీవో ఆదేశాల ఆధారంగా సబ్‌రిజిస్టార్లు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరుపై బదిలీ చేస్తారు.

    ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని వృద్ధులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    వివరాలు 

    ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కుటుంబాల్లో మార్పు

    తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు. వారసులు తమ బాధ్యతగా భావించకుండా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం.

    కొంతమంది వారిని ఇంటి నుంచి గెంటేస్తుండగా, మరికొందరు వృద్ధాశ్రమాలకు పంపుతున్నారు. ఈ తరహా పరిస్థితులను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కీలక పాత్ర పోషిస్తుంది.

    తల్లిదండ్రుల హక్కులను కాపాడటంలో ఈ చర్య సమర్థవంతంగా పనిచేయడం ద్వారా ఆ కుటుంబాల్లో మార్పు తీసుకురావాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: గ్రామీణ సంస్థలకు రెండో విడత అన్‌టైడ్ గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం  కేంద్ర ప్రభుత్వం
    Narayana: రాజధాని నిర్మాణానికి హడ్కో రూ.11వేల కోట్ల రుణం.. . సీఎండీతో చర్చించిన మంత్రి నారాయణ భారతదేశం
    AP Fibernet: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విధుల నుంచి 410 మంది తొలగింపు  భారతదేశం
    AP Govt : సంక్రాంతి బహుమతిగా నామినేటెడ్‌ పదవుల భర్తీకి సర్కార్‌ సిద్దం! సంక్రాంతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025