NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు
    భారతదేశం

    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

    వ్రాసిన వారు Naveen Stalin
    March 14, 2023 | 05:25 pm 1 నిమి చదవండి
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు

    కర్నాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. హుబ్లీ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. 1,507 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫారమ్‌ను ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 20 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ ప్లాట్‌ఫారమ్ హుబ్లీ యార్డు పునర్నిర్మాణంలో భాగంగా దీన్ని నిర్మించారు. భవిష్యత్‌లో హుబ్లీ-ధార్వాడ్ ప్రాంతంలో మరిన్ని రైళ్ల రాకపోకలు పెరగనున్ననేపథ్యంలో అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. హుబ్లీ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా శ్రీ సిద్ధారూఢ స్వామిజీ స్టేషన్ అని పిలుస్తారు.

    రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపొచ్చు

    రెండు రైళ్లను ఒకేసారి రెండు దిశల నుంచి పంపడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. ప్లాట్‌ఫారమ్ పొడవును జనవరి 12న ధృవీకరించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం హోసపేట-హుబ్లీ-తినైఘాట్ సెక్షన్ విద్యుద్ధీకరణ, హోసపేట స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం వంటి పనులను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ హోసపేట స్టేషన్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. హంపి స్మారక చిహ్నాలను తలపించేలా దీన్ని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కర్ణాటక
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    కర్ణాటక

    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ హర్యానా
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు బీజేపీ

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు ఆంధ్రప్రదేశ్
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ సికింద్రాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023