NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 12, 2023
    02:00 pm
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఆదివారం పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక 10 లైన్ల బెంగళూరు-మైసూరు హైవే ప్రారంభించనున్నారు. మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్‌లలో రూ.16,000 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారు.

    2/2

    ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార‌మ్‌ను ప్రారంభిచనున్న మోదీ

    బెంగళూరు-మైసూరు హైవే అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే రావడం వల్ల ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ హైవేను ప్ర‌ధాని జాతికి అంకితం చేయ‌నున్నారు. అలాగే హుబ్బలి-ధార్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పీఎంఓ తెలిపింది. మైసూరు-ఖుషాల్‌నగర్ నాలుగు లైన్ల రహదారికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని వెల్లడించింది. శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బ‌ళ్లి స్టేష‌న్‌లో ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార‌మ్‌ను ప్రారంభిస్తారు. రూ.20 కోట్లతో 1,507 మీటర్ల పొడవున ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    ప్రధాన మంత్రి

    నరేంద్ర మోదీ

    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ ప్రధాన మంత్రి
    నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు ప్రమాణ స్వీకారం
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం మేఘాలయ

    కర్ణాటక

    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో దేశంలో ఇద్దరు మృతి; రాష్ట్రాలు అలర్ట్ హర్యానా
    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు బీజేపీ
    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య బెంగళూరు

    అసెంబ్లీ ఎన్నికలు

    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు త్రిపుర
    మార్చి 7న నాగాలాండ్ సీఎంగా ​​ 'నీఫియు రియో' ప్రమాణస్వీకారం నాగాలాండ్
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ త్రిపుర

    ప్రధాన మంత్రి

    నేడు రాత్రి 7గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం నరేంద్ర మోదీ
    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ జీ20 సమావేశం
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023