NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక
    తదుపరి వార్తా కథనం
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక

    వ్రాసిన వారు Stalin
    Mar 12, 2023
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా కృష్టి చేస్తోంది. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దక్షిణాదిన బీజేపీకి కీలకమైన కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మోదీ భావిస్తున్నారు. అందుకే గత మూడు నెలల్లో ఇప్పటికే ఐదు సార్లు రాష్ట్రంలో పర్యటించగా, ఆదివారం మరోసారి కర్ణాటకకు రానున్నారు.

    రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానలు చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఆదివారం పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక 10 లైన్ల బెంగళూరు-మైసూరు హైవే ప్రారంభించనున్నారు.

    మాండ్యా, హుబ్బళ్లి-ధార్వాడ్‌లలో రూ.16,000 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభిస్తారు.

    ప్రధాని మోదీ

    ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార‌మ్‌ను ప్రారంభిచనున్న మోదీ

    బెంగళూరు-మైసూరు హైవే అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే రావడం వల్ల ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ హైవేను ప్ర‌ధాని జాతికి అంకితం చేయ‌నున్నారు.

    అలాగే హుబ్బలి-ధార్వాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని పీఎంఓ తెలిపింది. మైసూరు-ఖుషాల్‌నగర్ నాలుగు లైన్ల రహదారికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని వెల్లడించింది.

    శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బ‌ళ్లి స్టేష‌న్‌లో ప్ర‌పంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫార‌మ్‌ను ప్రారంభిస్తారు. రూ.20 కోట్లతో 1,507 మీటర్ల పొడవున ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను కూడా సొంతం చేసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికలు
    ప్రధాన మంత్రి

    తాజా

    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు దిల్లీ
    బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం జార్ఖండ్
    Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌‌లో హైలెట్స్ ఇవే బడ్జెట్ 2023

    కర్ణాటక

    కరోనా BF.7 వేరియంట్ సోకిన వారికి అక్కడ ఉచితంగా చికిత్స కోవిడ్
    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    కాలేజీలో దారుణం.. విద్యార్థినిపై కత్తితో పొడిచి హత్య.. భారతదేశం
    మెట్రో పిల్లర్ కూలి తల్లి, మూడేళ్ల కుమారుడు దుర్మరణం భారతదేశం

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర

    ప్రధాన మంత్రి

    ఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు నరేంద్ర మోదీ
    హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ హైదరాబాద్
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? రాజస్థాన్
    banned documentaries: భారత్‌లో నిషేధించిన ఈ ఐదు డాక్యుమెంటరీల గురించి తెలుసుకోండి నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025