Page Loader
Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

Chandrababu: ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార నివాసంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కలిశారు. ఈ సమావేశంలో, రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుని, ప్రధానమంత్రి మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది.

Details

సాయంత్రం 6:30 గంటలకు నిర్మలా సీతారామన్ తో భేటీ

ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఆ తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా ఆయన భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.