NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 
    హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

    హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.

    హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో దాదాపు 11ఎకరాల్లో 15అంతస్తుల్లో 'భారత్ భవన్'‌ను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చండీహోమంలో పాల్గొని పూర్ణాహుతి చేశారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు.

    బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.

    ఇప్పటికే దిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయాన్ని, అనేక ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యాలయాలను బీఆర్ఎస్ ప్రారంభించుకున్నది. ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా హైదరాబాద్‌లో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

    తెలంగాణ

    దేశంలోని బీఆర్ఎస్ కార్యకలాపాలన్ని ఇక్కడి నుంచే 

    'భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌' కేంద్రంగా రాజకీయ అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహించి కార్మికులు, నాయకులకు సమగ్ర సమాచారం అందించనున్నారు.

    తొలిదశలో 15 అంతస్తుల భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు.

    ఈ కేంద్రం పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా సౌకర్యంగా పని చేస్తుంది. వారికి దేశం నలుమూలల నుంచి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇందులో విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్ లైబ్రరీ, బహుభాషా వార్తాపత్రికలు, వార్తల సేకరణ సేవలు, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటివి ఉంటాయి.

    ట్రైనీలు ఉండేందుకు అవసరమైన వసతిని ఇందులోనే కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత సంస్థల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన నిపుణులను శిక్షణ, పరిశోధన కార్యక్రమాలను నిర్వహించడానికి నియమిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    హైదరాబాద్
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తాజా వార్తలు

    తాజా

    Jyoti Malhotra: 'పాక్ గూఢచారి' జ్యోతి మల్హోత్రాతో ఒడిశా యూట్యూబర్ కి సంబంధమేంటి?.. ఒడిశా పోలీసుల దర్యాప్తు హర్యానా
    Gold Price:బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల.. హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే బంగారం
    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, సరిహద్దు ప్రాంతాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్
    తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణ

    హైదరాబాద్

     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్‌టీపీ)
    గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్  తెలంగాణ

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    ఎమ్మెల్యేల ఎర కేసు: అప్పటి వరకు విచారణకు రాలేనంటూ ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్ తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? ఆంధ్రప్రదేశ్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భారతదేశం

    తాజా వార్తలు

    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి  కర్ణాటక
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    పీఎల్‌ఎఫ్‌ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్‌లో ఎన్‌ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం  జార్ఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025