NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం
    తదుపరి వార్తా కథనం
    Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం
    రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం

    Telangana: రాష్ట్రంలో స్తంభించపోయిన చెక్‌డ్యాంల నిర్మాణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 13, 2025
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో చెక్‌డ్యాంల నిర్మాణాలు నిలిచిపోనున్నాయి. నాబార్డు నిధులతో గత ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన పనుల్లో మూడోవంతు మాత్రమే పూర్తి అయ్యాయి.

    నాబార్డు హై పవర్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. ఇందులో చెక్‌డ్యాంల నిర్మాణాలు, రుణాలపై చర్చ జరిగింది.

    రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ నిధులతో అమలు చేస్తున్న పథకాలు, రుణాల వినియోగంపై కమిటీలో చర్చలు జరిగాయి.

    2019లో చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆమోదం ఇచ్చిన ప్రభుత్వం, నాబార్డు ఆర్థిక సాయంతో మొదటి విడతలో 638 నిర్మాణాలు చేపట్టింది.

    Details

    ఆర్‌ఐడీఎఫ్ నిధుల ద్వారా చెక్‌డ్యాంల నిర్మాణాలకు రుణాలు

    ఆర్‌ఐడీఎఫ్ నిధుల ద్వారా 484 చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.2,013.75 కోట్ల రుణం కేటాయించారు.

    వీటిలో 334 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 150 పనులు వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్నాయి.

    పూర్తి అయిన పనులకు రూ.1,609 కోట్ల చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం 638 చెక్‌డ్యాంలకు అనుమతులు జారీ చేయడంతో, 2023 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 392 మాత్రమే పూర్తయ్యాయి.

    మిగిలిన 246 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో రెండో విడతలో 562 పనులు చేపట్టాలని నిర్ణయించారు.

    Details

    రెండో విడతకు 2వేల కోట్ల ఖర్చు

    రెండో విడతకు రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు.

    కానీ మొదటి విడత పనులు పూర్తి చేయలేక పోయిన దశలో రెండో విడత పనులు పెండింగ్‌లో పడ్డాయి. అసంపూర్తిగా మిగిలిన పనులకు నాబార్డు నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది.

    పనులు పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడంతో మరికొన్ని పనులకు నిధులు మంజూరు కాలేదు.

    ఈ ఏడాది మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేయడం ద్వారా మిగిలిన నిధులు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క కాంగ్రెస్
    Numaish: హైదరాబాద్‌లో నుమాయిష్‌ ప్రారంభం వాయిదా.. జనవరి 3న ప్రారంభం హైదరాబాద్
    TG Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఎందుకంటే? మన్మోహన్ సింగ్
    VC Sajjanar: స్వార్థపూరిత ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మొద్దు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025