NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి
    కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

     Canada: కెనడా బీచ్ సమీపంలో ఆప్ నాయకుడి కుమార్తె అనుమానాస్పద మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 29, 2025
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కెనడాలో ఒక భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

    నాలుగు రోజులుగా అదృశ్యమైన వంశిక అనే 21 ఏళ్ల యువతి మృతదేహం బీచ్‌ ప్రాంతంలో కనిపించింది.

    ఈ విషయాన్ని కెనడాలో ఉన్న భారత హైకమిషన్ అధికారికంగా ధృవీకరించింది. అధికార వర్గాల ప్రకారం, వంశిక పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా, ఆమె ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు దేవిందర్‌ సింగ్‌ కుమార్తె.

    ఆమె రెండేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లింది. ఏప్రిల్‌ 25వ తేదీన, శుక్రవారం రాత్రి అద్దె ఇంటిని వెతకాలని బయటకు వెళ్లిన వంశిక ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు.

    వివరాలు 

    మృతదేహం సమీపంలోని బీచ్‌లో..

    తన కుటుంబ సభ్యులతో ప్రతిరోజూ ఉదయం మాట్లాడే అలవాటు ఉన్న వంశిక,ఆ రోజు నుంచి ఫోన్‌ చేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

    వారు పలుమార్లు ఆమెకు ఫోన్‌ చేసినా,ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండడంతో కెనడాలోని ఆమె సన్నిహితులు పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసుల విచారణలో ఆమె మృతదేహం సమీపంలోని బీచ్‌లో గుర్తించబడింది.

    ప్రస్తుతం వంశిక మృతికి కారణాలపై స్పష్టత లేదు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    ఈఘటనపై కెనడాలోని భారత రాయబారకార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

    మృతికి గల అసలైన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారని రాయబారి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

    ఇదే సమయంలో,ఇటీవలే జరిగిన మరో విషాదకర సంఘటన కూడా ఆందోళన కలిగిస్తోంది.

    వివరాలు 

    హమిల్టన్‌లోని బస్టాప్ వద్ద కాల్పులకు బలైన హర్‌సిమ్రత్‌ రంధావా

    హర్‌సిమ్రత్‌ రంధావా అనే 21 ఏళ్ల భారతీయ విద్యార్థిని హమిల్టన్‌లోని బస్టాప్ వద్ద కాల్పులకు బలైంది.

    హర్‌సిమ్రత్‌ అక్కడి కాలేజీలో చదువుతూ ఉండగా, బస్టాప్‌లో వేచిచూస్తుండగా ఓ వ్యక్తి కారులో వచ్చి మరో వాహనంపై కాల్పులు జరిపాడు.

    అయితే, కాల్పుల్లో ఒక బుల్లెట్ హర్‌సిమ్రత్‌కు తగలడం వల్ల ఆమె అక్కడికక్కడే గాయపడి పడిపోయింది.

    వెంటనే ఆస్పత్రికి తరలించినా,అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

    ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే రాక్‌లాండ్‌ ప్రాంతంలో మరో భారతీయుడు కత్తి దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

    అయితే ఆ వ్యక్తి పేరు లేదా ఇతర సమాచారం ఇంకా బయటకు రాలేదు.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కెనడా

    India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌  భారతదేశం
    India-Canada: 'మోదీ,విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పేర్లు ప్రస్తావించలేదు'.. భారత్‌ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా అంతర్జాతీయం
    Canada-India: భారతదేశానికి వచ్చే ప్రయాణికుల అదనపు స్క్రీనింగ్‌ను నిలిపేసిన కెనడా  అంతర్జాతీయం
    Canada: కెనడా-అమెరికా సరిహద్దు చొరబాట్లలో భారతీయులే పైచేయి  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025