NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ
    తదుపరి వార్తా కథనం
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ
    ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ

    వ్రాసిన వారు Stalin
    Mar 15, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లను సవాల్ చేస్తూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

    కవిత పిటిషన్‌ను మార్చి 24న విచారించేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

    ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. మహిళను విచారించడానికి ఈడీ ఆఫీస్‌కు పిలవడంపై కవిత పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

    కవిత

    ఈడీ చెప్పిన విధంగా విచారించడం లేదు: న్యాయవాది

    మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను విచారించాలని ఈడీ భావిస్తోందని, అయితే ఈడీ ఆ పని చేయలేదని కవిత తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

    ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కవిత ఎందుకు కోరుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 16వ తేదీన ఈడీ విచారణ మరోసారి ఉందని సమాధానం చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటిషన్‌ను మార్చి 24న విచారించాలని నిర్ణయించింది.

    అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఇప్పటికే తాను కవిత బినామీ అని వాంగ్మూలంలో చెప్పారు. ఆమె చెప్పినందు వల్లే తన ఖాతాలోకి 32కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. కోటి రూపాయలు కూడా తన ఖాతాలోకి వచ్చినట్లు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల కవిత
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    సుప్రీంకోర్టు

    తాజా

    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా

    కల్వకుంట్ల కవిత

    దిల్లీ లిక్కర్ కుంభకోణం.. కొత్త ఛార్జ్‌షీట్‌లోనూ కవిత పేరు భారతదేశం
    ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నం: ఎమ్మెల్సీ కవిత భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    దిల్లీ మద్యం కుంభకోణం: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ దిల్లీ
    తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ దిల్లీ

    సుప్రీంకోర్టు

    పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది? తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ భారతదేశం
    పెద్ద నోట్ల రద్దు.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోదీ
    ఎమ్మెల్యే, ఎంపీల వాక్ స్వాతంత్య్ర హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025