NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?
    మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?

    Tg Ssc Exams 2025 : మార్చి 21 నుంచి టెన్త్‌ పరీక్షలు! నిమిషం నిబంధన అమల్లో ఉంటుందా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    11:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

    పరీక్షా కేంద్రాల ఏర్పాటు,వసతుల కల్పన తదితర ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు పూర్తి దృష్టి సారించారు.

    ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఈవోలు పరీక్షా కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

    ఫిబ్రవరిలోనే కలెక్టర్లు ఈ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు ప్రతి పరీక్షా కేంద్రానికి ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పోలీసు అధికారి, ఇద్దరు అటెండర్లను ఏర్పాటు చేశారు.

    ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో ఏర్పాటు చేయగా, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నాయి.

    వివరాలు 

    సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. ప్రశ్నపత్రాలు తెరవాలి  

    కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పరీక్షల నిర్వహణ సరళిని స్వయంగా తనిఖీ చేయనున్నారు.

    ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో నిఘానేత్రాలను (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేశారు.

    పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే ప్రశ్నపత్రాల కట్టలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెరవాల్సి ఉంటుంది.

    సీసీ కెమెరాలు లేని కేంద్రాల్లో వీటిని వెంటనే అమర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

    పరీక్షలకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తే లేదా ఫిర్యాదు చేయాలంటే కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లకు ఫోన్‌ చేయాలి.

    కొన్నిచోట్ల ప్రైవేట్ స్కూళ్లు ఫీజు చెల్లించాల్సిందేనని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయని, దీనిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

    వివరాలు 

    8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి..

    డీఈవో కార్యాలయాల నుంచి ప్రతీ పాఠశాలకు హాల్‌టికెట్లు పంపిణీ చేయగా, bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు స్వయంగా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష రాయవచ్చు.

    డౌన్‌లోడ్‌ చేసిన హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని వెల్లడించారు.

    పదో తరగతి పరీక్షలకు నిమిష నిబంధన ఏదీ లేకపోయినా ఆలస్యంగా రావొద్దని, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

    కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవడం మంచిదని, ఉదయం 8:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    Telangana: విజయ డెయిరీ పాల సేకరణ ధరల సవరణ.. ప్రభుత్వానికి డెయిరీ యాజమాన్యం ప్రతిపాదనలు భారతదేశం
    SLBC tunnel Collapse: ఉబికివస్తున్న నీరు.. 13 రోజులైనా జాడలేని మృతదేహాలు భారతదేశం
    SLBC tunnel collapse: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న వారి జాడ కోసం.. కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌..  భారతదేశం
    Telangana cabinet decisions: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025