Page Loader
Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు
కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు

Engineering Fees: కొత్త ఫీజులకు దరఖాస్తు చేసిన కళాశాలలు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రుసుములు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
12:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులను నిర్ణయించడానికి 157 బీటెక్, 102 బీఫార్మసీ కళాశాలలు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో 24 రకాల ఉన్నత విద్య కోర్సులను అందించే 1,291 కళాశాలలు ఉండగా, వాటిలో 1,229 కళాశాలలు మాత్రమే ఈ దరఖాస్తును చేసినవి. ప్రస్తుతం, కళాశాలలు వార్షిక ఫీజుల వసూలు చేస్తున్నాయి, కానీ టీఏఎఫ్‌ఆర్‌సీ ఈసారి సెమిస్టర్‌ వారీగా ఫీజులపై చర్చించనుందని సమాచారం. ఈ నిర్ణయం 2025-28 విద్యాసంవత్సరాల వరకు అమలులో ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలు 176 ఉండగా, వాటిలో 157 కళాశాలలు మాత్రమే ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

వివరాలు 

 19 కళాశాలలు మూసినట్లే.. 

ఈ పరిస్థితిని చూస్తే మిగిలిన 19 కళాశాలలు మూసినట్లే అనిపిస్తోంది. ఎంటెక్, ఫార్మా డీ, ఎంసీఏ, ఎంఈడీ వంటి కోర్సులు అందించే కళాశాలల సంఖ్య ఈసారి స్వల్పంగా పెరిగింది. కొన్ని కళాశాలలు తమ ఫీజును రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచాలని కోరినట్లు సమాచారం. 2021-22, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను కళాశాలలు కమిటీకి సమర్పించాయి. ఈ లెక్కలు, విద్యార్థుల విద్య, వారి సౌకర్యాలకు ఖర్చు చేసిన మొత్తం పరిగణనలోకి తీసుకొని కొత్త ఫీజులను నిర్ణయించనున్నారు. ఈ లెక్కలను పరిశీలించేందుకు టీఏఎఫ్‌ఆర్‌సీ రెండు ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ సంస్థలను నియమించింది.