LOADING...
Karur stampede: కరూర్ ర్యాలీపై తప్పుడు వార్తలు.. యూట్యూబర్ అరెస్టు
కరూర్ ర్యాలీపై తప్పుడు వార్తలు.. యూట్యూబర్ అరెస్టు

Karur stampede: కరూర్ ర్యాలీపై తప్పుడు వార్తలు.. యూట్యూబర్ అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ప్రచార సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట (Karur stampede) ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు తాజాగా ఓ యూట్యూబర్‌ను అరెస్టు చేశారు. టీవీకే ర్యాలీలో జరిగిన ప్రమాదంపై నకిలీ వార్తలను ప్రచారం చేసిన తమిళనాడు యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను(YouTuber Felix Gerald) సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెడ్‌పిక్స్‌ అనే యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్, తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నకిలీ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశాడు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో, పోలీసులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.

Details

తప్పుడు ప్రచారాలు చేసిన 25మంది కేసులు నమోదు

ఈ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేసిన మరో 25 మందిపై కూడా కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజాశాంతి భంగం కలిగించే, ఉద్రిక్తతలను రేకెత్తించే కంటెంట్ షేర్ చేసినందున ఈ చర్యలు తీసుకున్నారు. కరూర్‌లో శనివారం జరిగిన విజయ్ ప్రచార సభలోని తొక్కిసలాట ఘటనలో, కరూర్ జిల్లా టీవీకే కార్యదర్శి మదియళగన్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌పై కూడా అరెస్ట్ అవకాశం ఉంది. అలాగే, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

Details

ఘటనపై దర్యాప్తు

దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీని తొలగించి, అతని స్థానంలో అదనపు డిప్యూటీ ఎస్పీ (ఏడీఎస్పీ) ప్రేమానందన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ విభాగాధికారి కరూర్ తొక్కిసలాట కేసులో కొత్త దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం, విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.