NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!
    భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!

    Bhu Bharati: భూ భారతిలో రైతులకు ఇబ్బందులు.. దరఖాస్తు తర్వాత ఇ-కేవైసీ కష్టాలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సాగు భూముల రిజిస్ట్రేషన్‌కు వినియోగిస్తున్న భూ భారత్ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు చేసుకునే రైతులు మీసేవ కేంద్రాలకు వెళ్తున్నప్పటికీ, 'ఈ-కేవైసీ' ప్రక్రియ పూర్తి కావడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

    వారసత్వ బదిలీ, వివరాల సవరణ, తండ్రి పేరు, లింగం, భూ విస్తీర్ణం మార్పులు తదితర సేవల కోసం దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించిన తర్వాత 'ఈ-కేవైసీ'ను పూర్తి చేయాల్సి వస్తోంది.

    ఈ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ రూపంలో వినియోగదారుడు ఎవరు? అన్న విషయాన్ని బయోమెట్రిక్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.

    ఆన్‌లైన్‌లో ఈ అవకాశాన్ని చూపించే ఐచ్ఛికం ప్రస్తుతానికి కనిపించడం లేదు.

    గతంలో ధరణి పోర్టల్‌లో ఈ-కేవైసీ ఐచ్ఛికం అందుబాటులో ఉండేది. కానీ భూ భారతిలో ఆ ఎంపిక తెరుచుకోకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    Details

    లాగిన్‌ తప్పనిసరి - అవగాహన లోపం 

    భూ భారత్ పోర్టల్‌లో లావాదేవీల వివరాలను తెలుసుకోవాలంటే, వినియోగదారులు తప్పనిసరిగా లాగిన్‌ కావాల్సి వస్తోంది.

    పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్‌ కావాలి. అయితే దీనిపై అవగాహన లేకపోవడం వల్ల రైతులు మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.

    అక్కడి నిర్వాహకులు కొంత రుసుము తీసుకొని తమ లాగిన్‌ ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడంతో రైతులు అదేపనిగా వారు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    ధరణి పోర్టల్‌లో లాగిన్‌తో పాటు సాధారణ పద్ధతిలోనూ సమాచారం తెలుసుకునే వీలుండేది. కానీ భూ భారతిలో ఆ వెసులుబాటు లేదు.

    Details

    భూమి పట్టాలు అందుబాటులో లేవు 

    గ్రామాలు, కమతాల భూముల పటాలు కూడా ధరణి మాదిరిగా భూ భారతిలో స్పష్టంగా కనిపించడంలేదు.

    జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ లేదా ఖాతా నంబరు నమోదు చేసిన తర్వాత భూమిపటాలు చూపించాల్సి ఉన్నా, ప్రస్తుతం అవి అందుబాటులోకి రాలేదు.

    రెవెన్యూ శాఖ వర్గాల ప్రకారం, పైలట్‌ మండలాల్లో పరీక్షలు పూర్తయ్యాక మాత్రమే భూ భారతిలో అన్ని సేవలు సక్రమంగా అందుబాటులోకి రానున్నాయి.

    తద్వారా రైతులకు అవసరమైన సమాచారం సులభంగా లభించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    తెలంగాణ

    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్
    Telangana: ఇంటర్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినవారికి మరో అవకాశం! ఇంటర్
    Electricity Consumption: దేశంలో విద్యుత్‌ వినియోగం,డిమాండులో తెలంగాణకు 8వ స్థానం.. కేంద్ర విద్యుత్‌ మండలి నివేదికలో వెల్లడి  భారతదేశం
    Weather Update: తెలంగాణలో మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు భారీ వర్షాలు

    ఇండియా

    TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం! తిరుమల తిరుపతి దేవస్థానం
    India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్ చైనా
    Indian fisherman: పాకిస్థాన్ జైల్లో మగ్గుతూ భారత మత్స్యకారుడు ఆత్మహత్య పాకిస్థాన్
    TGPSC: తెలంగాణ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ విడుదల.. మహిళా అభ్యర్థి టాప్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025