NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం
    డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం

    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రంలోని 31 సాగునీటి ప్రాజెక్టుల్లో స్పిల్‌వేలు (అదనపు జలవిసర్జన మార్గాలు)నిర్మాణ సామర్థ్యాన్ని మించి వరదలు వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

    ఈ ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి గరిష్ఠ వరద ప్రవాహాన్ని అంచనా వేసి, ఆ మేరకు స్పిల్‌వేలు, కరకట్టలు నిర్మించారు.

    అయితే, వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా, అప్పట్లో నిర్ణయించిన ప్రమాణాలు ఇప్పుడు సరిపోవు అన్న విషయం స్పష్టమైంది.

    ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని,ఆయా ప్రాజెక్టుల్లో అదనంగా స్పిల్‌వేలను నిర్మించడం,అవసరమైన ఇతర భద్రత చర్యలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.

    జాతీయ డ్యాం భద్రతా చట్టం (National Dam Safety Act) ప్రకారం,దేశవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల భద్రతను అంచనా వేసేందుకు ఇలాంటి అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

    వివరాలు 

    ప్రతి రాష్ట్రంలో డ్యాం భద్రతా అథారిటీ

    గతంలో కొన్ని ప్రాజెక్టుల్లో డ్యాం కొట్టుకుపోయిన ఘటనలు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం డ్యాం భద్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చింది.

    2021లో అమలులోకి వచ్చిన జాతీయ డ్యాం భద్రతా చట్టం 54(2)(క్యూ) సెక్షన్ ప్రకారం, రాష్ట్రాలు నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా డ్యాంల భద్రతపై సమగ్ర పరిశీలనలు చేయాల్సి ఉంది.

    ఈ చట్టంలో డ్యాం భద్రతకు సంబంధించి అనేక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా, ప్రతి రాష్ట్రంలో డ్యాం భద్రతా అథారిటీ ఏర్పాటైంది.

    వివరాలు 

    రాష్ట్రంలోని 167 డ్యాంలపై సమగ్ర అధ్యయనం 

    మొత్తంగా రాష్ట్రంలో ఉన్న 167 డ్యాంలను అధ్యయనానికి తీసుకున్నారు.ఒక్కో జలాశయం ఎంత మేర నీటిని నిల్వ చేయగలదు?స్పిల్‌వే ఎక్కడివరకు నిర్మించబడింది?దానికి ఆనుకొని ఉన్న కట్టల ఎత్తు ఎంత?స్పిల్‌వే పొడవు ఎంత?గరిష్ఠంగా నీటిని నిల్వ చేసే స్థాయి ఎంత?అనే అంశాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.

    ఈఅధ్యయనం అనంతరం 31 డ్యాంలు అత్యధిక ప్రమాద స్థాయిలో ఉన్నాయని గుర్తించారు.

    ఇప్పటికీ ఆప్రాజెక్టుల్లో ఉన్న స్పిల్‌వేల సామర్థ్యం,వరద ప్రవాహానికి తట్టుకునేలా లేదన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

    తాజాగా జాతీయడ్యాం భద్రతా అథారిటీ ఛైర్మన్‌ నేతృత్వంలోని ఒక బృందం రాష్ట్రానికి వచ్చి, డ్యాంల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది.

    భవిష్యత్తులో పెద్దముప్పులు ఎదురుకాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని భద్రతాచర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈసమీక్షలో తేలింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం ఆంధ్రప్రదేశ్
    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు గుంటూరు జిల్లా
    Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా బాలీవుడ్
    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన

    ఆంధ్రప్రదేశ్

    Heatwave: నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం.. దొర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత భారతదేశం
    AP SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. పది ఫలితాలు విడుదల! భారతదేశం
    AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం భారతదేశం
    Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి అమరావతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025