NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం
    ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం

    University Scam: ఆ యూనివర్సిటీలో టీ, బిస్కెట్ల కోసం రూ. 8లక్షల ఖర్చు.. ఆపై రూ.44లక్షలు కుంభకోణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్ఖండ్‌లోని ప్రసిద్ధ వినోబా భావే విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ నిర్వహించిన దర్యాప్తులో, విశ్వవిద్యాలయంలో రూ.44 లక్షల అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది.

    ఈ అక్రమాలు విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ముకుల్ నారాయణ్ దేవ్ హయాంలో చోటుచేసుకున్నాయని తేలింది.

    ఆడిట్ డైరెక్టరేట్ రూపొందించిన నివేదికను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌కు సమర్పించగా, ఒక నెలలోపు అక్రమంగా ఖర్చయిన మొత్తాన్ని వసూలు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

    వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో స్నాక్స్, టీ, బిస్కెట్లు కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

    Details

    ప్రభుత్వ దర్యాప్తుతో నిజాలు వెలుగులోకి

    విశ్వవిద్యాలయం కరోనా కారణంగా మూసివేసిన సమయంలోనూ ఈ ఖర్చులు జరిగినట్లు గుర్తించారు.

    అంతేకాకుండా వైస్ ఛాన్సలర్ నివాసానికి రంగులు వేయడానికి లక్షల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారు. పెయింట్ మెటీరియల్ కొనుగోలులో గణనీయమైన అవకతవకలు చోటుచేసుకున్నాయి.

    అదనంగా, ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడమే కాకుండా, ఇంధన ఖర్చును పూర్తిగా విశ్వవిద్యాలయ నిధుల ద్వారా సమకూర్చారు.

    అలాగే మాజీ వీసీ ముకుల్ నారాయణ్ దేవ్ కోసం అనవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే విశ్వవిద్యాలయ నిధులతో రెండుసార్లు మొబైల్ ఫోన్లు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

    Details

    అవకతవకలపై కఠిన చర్యలకు ఆదేశాలు

    కంప్యూటర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నా కొత్తగా మరిన్ని కంప్యూటర్ల కొనుగోలుకు భారీగా ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది.

    కొనుగోలు చేసిన వస్తువుల గురించి స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడం గమనార్హం. అంతేగాక వైస్ ఛాన్సలర్ నివాసంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు విషయంలోనూ భారీగా అక్రమ ఖర్చులు జరిగాయని నివేదికలో తేలింది.

    వైస్ ఛాన్సలర్ నివాసానికి మంచం, సోఫా, వాషింగ్ మెషిన్ వంటి సామగ్రిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన వైద్య పరికరాలను సైతం కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

    ఈ మొత్తం అవకతవకలపై విశ్వవిద్యాలయం, ఆర్థిక శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆడిట్ నివేదికలో సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జార్ఖండ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    జార్ఖండ్

    Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం  భారతదేశం
    Sita Soren: బీజేపీలో చేరిన జార్ఖండ్‌ నేత సీతా సోరెన్‌  భారతదేశం
    Jharkhand : జార్ఖండ్‌లో ట్రిపుల్ మర్డర్.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి  భారతదేశం
    New India-PM Modi-Pakistan: ఇది సరికొత్త భారత్...పాక్ పప్పులుడకట్లేదు: ప్రధాని నరేంద్రమోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025