NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
    తదుపరి వార్తా కథనం
    KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
    ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్

    KTR: ఫార్ములా ఈ రేస్ కేసు.. నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    10:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.

    రేపు ఈడీ కూడా కేటీఆర్‌ను విచారించనుంది. ఈ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిన నేపథ్యంలో కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయి. ఉదయం 10 గంటలకు విచారణకు హజరు కానున్నారు. విదేశీ సంస్థలకు నిధుల మళ్లింపుపై ప్రశ్నించేందుకు ఏసీబీ సిద్ధమైంది.

    ఈ దర్యాప్తులో కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.45.71 కోట్ల చెల్లింపులో ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణలొచ్చాయి.

    Details

    ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు నిధులు బదిలీ

    ఆర్ బి ఐ అనుమతి లేకుండానే ఈ నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేసినట్లు గుర్తించారు.

    దీంతో కేటీఆర్‌తో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ విచారణ అనంతరం వీరిని కూడా ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.

    ఈ కేసులో నోటీసులు అందుకున్న హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. గడువు కోరుతూ వారు ఈమెయిల్ ద్వారా అభ్యర్థన పంపారు.

    ఈ నేపథ్యంలో వారి విచారణ తాత్కాలికంగా వాయిదా వేసి, ఈడీ కొత్త తేదీలతో నోటీసులు జారీ చేసింది.

    Details

    నోటీసులు జారీ చేసిన ఈడీ

    ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా, అలాగే ఆర్బీఐ అనుమతి పొందకుండా నిధులు మళ్లించారనే ఆరోపణలతో కేటీఆర్, హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.

    ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

    ఇక ఏసీబీ కూడా నోటీసులు జారీ చేయడంతో, ఫార్ములా ఈ రేస్ కేసుపై ఉత్కంఠ మరింత పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    బీఆర్ఎస్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  తెలంగాణ
    నేడు దిల్లీకి మంత్రి కేటీఆర్.. పెండింగ్ ప్రాజెక్టుల కోసం అమిత్ షాతో కీలక భేటీ  అమిత్ షా
    తెలంగాణలో రూ.3500 కోట్లతో మెగా పెట్టుబడులు.. త్వరలోనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం : లులూ సంస్థ తెలంగాణ
    దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఉప్పల్ స్కై వాక్

    బీఆర్ఎస్

    Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి తెలంగాణ
    Kotha Prabhakar Reddy: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో ఇద్దరు..?  కొత్త ప్రభాకర్ రెడ్డి
    Kasani Gnaneshwar : ఇవాళ గూలాబీ గూటికి చేరనున్న కాసాని.. గోషామహల్ బరిలో మాజీ టీడీపీ చీఫ్  తెలంగాణ
    CM KCR : సీఎం కేసీఆర్‌కు తప్పిన పెను ప్రమాదం.. సాంకేతిక లోపంతో హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025