NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ 
    దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ

    Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. మరో మ్యానిఫెస్టో ప్రకటించిన బీజేపీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 21, 2025
    02:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పక్షాలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

    ఈ క్రమంలో బీజేపీ (BJP) తాజాగా మరో మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

    తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందజేస్తామని హామీ ఇచ్చింది.

    పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న యువతకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది.

    వివరాలు 

    షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ప్రత్యేక పథకాలు 

    భీమ్‌రావ్ అంబేడ్కర్ స్టైఫండ్ పథకం కింద ఐటీఐలు, పాలిటెక్నిక్ స్కిల్ సెంటర్లలో టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 ఉపకార వేతనాలు అందిస్తామని బీజేపీ ప్రకటించింది.

    అలాగే, ఆప్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

    ఈ సందర్భంగా 'సంకల్ప పత్ర-2'ను విడుదల చేశారు.

    వివరాలు 

    మొదటి భాగంలో ఇచ్చిన హామీలు 

    ఇదివరకే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప పత్ర-1'ను విడుదల చేశారు.

    ఇందులో గర్భిణి మహిళలకు రూ.21వేల ఆర్థికసాయం, పేద కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ (LPG) సిలిండర్‌లు అందించనున్నట్లు వెల్లడించారు.

    'మహిళా సమృద్ధి యోజన' కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థికసాయాన్ని అందిస్తామని తెలిపారు.

    వివరాలు 

    బీజేపీ పథకాలపై ఆప్‌ విమర్శలు 

    బీజేపీ మ్యానిఫెస్టోను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు.

    "బీజేపీ ప్రకటించిన ఉచిత విద్య నిజంగా అందరికీ అందుబాటులో ఉంటుందా? ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య అందిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే, తల్లిదండ్రులు తమ పిల్లల విద్య కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

    ''దిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి'' అని కేజ్రీవాల్ హెచ్చరించారు.

    ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుండగా, ఈ హామీలు ఓటర్లను ఎంతవరకు ఆకర్షిస్తాయో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    బీజేపీ

    Yogeshwar Dutt: వినేష్ ఫోగట్ క్షమాపణ చెప్పాలి.. ఇతరులపై నిందలు వేయటం కాదు: యోగేశ్వర్ దత్ క్రీడలు
    Ruta Awhad: 'లాడెన్ జీవిత చరిత్ర చదవండి': జితేంద్ర అవధ్‌ సతీమణి వ్యాఖ్యలపై దుమారం మహారాష్ట్ర
    Farooq Abdullah: బీజేపీని అడ్డుకునేందుకు పొత్తులకైనా సిద్ధం.. ఫరూఖ్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్
    Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌ హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025