NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స
    మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స

    GBS: మహారాష్ట్రలో జీబీఎస్ విజృంభణ.. ఐదుగురు మృతి.. 28 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 03, 2025
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.

    వారిలో 124 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. GBS అనేది అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి, ఇది మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నాడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

    దీంతో కండరాల బలహీనత, కొన్ని సందర్భాల్లో పారాలసిస్‌కి దారి తీయవచ్చు.

    ఈ వ్యాధితో బాధపడుతున్న 124 మందిలో, 28 మందికి శ్వాస సంబంధిత సమస్యలతో వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది.

    భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతోంది.

    Details

    పూణేలో ఎక్కువ కేసులు

    ఆరోగ్య పరీక్షలలో Campylobacter jejuni అనే బ్యాక్టీరియా కొందరి రోగుల మల నమూనాల్లో గుర్తించారు.

    ముఖ్యంగా పుణే నగరంలో ఈ వ్యాధి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. పుణే నగరంలో 160 నీటి నమూనాలను పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీకి పంపగా, 8 నీటి నమునాల్లో కాలుష్యం ఉన్నట్లు గుర్తించారు.

    సిన్హగడ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోని ఓ ప్రైవేట్ బోర్‌వెల్ నీటిలో E.coli అనే బ్యాక్టీరియా ఉందని అధికారికంగా వెల్లడైంది.

    E.coli అంటే మలవిసర్జన లేదా జంతువుల వ్యర్థాలతో నీటి కాలుష్యం జరిగినట్లు అర్థం.

    పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే నాందేడ్, కిర్కట్వాడి, ధయారి వంటి ప్రాంతాల్లో బోర్‌వెల్, బావుల నుంచి నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది.

    Details

    ఈ వ్యాధి లక్షణాలివే 

    కండరాల బలహీనత

    చేతులు, కాళ్లు బలహీనంగా మారడం లేదా పారాలసిస్

    నొప్పి

    కాళ్లు, వెన్ను ప్రాంతాల్లో తీవ్రమైన నొప్పి

    శ్వాస సమస్యలు

    శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరాడకపోవడం

    కంటిచూపు సమస్యలు

    దృష్టి మసకబారడం, డబుల్ విజన్

    రక్తపోటు సమస్యలు

    గుండె రేటు మారడం, బీపీ అధికంగా లేదా తక్కువగా ఉండడం

    మల, మూత్ర సమస్యలు

    మల విసర్జన నెమ్మదించడం, మూత్ర నియంత్రణ కోల్పోవడం

    జాగ్రత్తలు తీసుకోవాలి

    నీటి కాలుష్యం నివారించాలి: తాగే నీటిని మరిగించి వాడండి

    పరిశుభ్రత పాటించాలి: చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి

    అలసట, బలహీనత కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

    ఈ వ్యాధి తీవ్రంగా మారకముందే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. సపోర్ట్ ఇచ్చిన ఎన్సీపీ చీఫ్ భారతదేశం
    Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే ఇండియా
    Devendra Fadnavis: మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌.. శిందే వర్గం నేత కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025