NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lokesh on DSC: ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ
    తదుపరి వార్తా కథనం
    Lokesh on DSC: ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ
    ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ

    Lokesh on DSC: ఈ నెలలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్.. నారా లోకేశ్ క్లారిటీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 04, 2025
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్‌ శుభవార్త అందించారు. ఈ మార్చిలోనే మెగా డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

    ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవో నంబర్‌ 117ను రద్దు చేస్తామని, దానికి ప్రత్యామ్నాయంగా కొత్త విధానాలను అమలు చేస్తామని తెలిపారు.

    అధ్యాపకుల బదిలీల చట్టంతో పాటు వారికి పదోన్నతులు కల్పించడం,పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

    ఏపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

    ఇప్పటికే విద్యార్థులకు అందించే కిట్లపై రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

    అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు.

    వివరాలు 

    విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మిస్తాం: లోకేశ్ 

    ఆదర్శ పాఠశాలలు,ఇతర ఉన్నత పాఠశాలలు విద్యార్థుల నివాసానికి చాలా దూరంగా ఉంటే,ఆ విద్యార్థులకు రవాణా భత్యం అందించనున్నట్లు తెలిపారు.

    రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మిస్తామని నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

    భారత్‌లో ఏపీ విద్యా వ్యవస్థను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేస్తున్నామని అన్నారు.

    జీవో 117 కారణంగా వచ్చిన ప్రతికూల ప్రభావాలను గురించి గతంలో చాలామంది తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

    గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ జీవో పేరుతో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని, వారు ప్రైవేట్‌ పాఠశాలలకు మారిపోయారని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్

    తాజా

    India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్ అమెరికా
    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ
    Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత బీఆర్ఎస్

    నారా లోకేశ్

    #YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం  పాదయాత్ర
    #Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం  పాదయాత్ర
    Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్
    Lokesh Yuvagalam: ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ.. హాజరు కానున్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025