NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్
    హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

    Raja Singh: హేట్ స్పీచ్ ఆరోపణలు.. రాజా సింగ్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2025
    11:37 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ మెటా గట్టి షాక్‌ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగిస్తూ చర్యలు తీసుకుంది.

    రాజా సింగ్ పేరుతో ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తొలగించినట్లు తెలుస్తోంది.

    ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సుమారు 10 లక్షల మంది ఫేస్‌బుక్ గ్రూప్‌ మెంబర్స్, 1.55 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారని సమాచారం.

    రాజా సింగ్ సోషల్‌ మీడియాలో ధ్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక వెలువడిన వారం రోజుల్లోనే మెటా ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    Details

    చర్యలు తీసుకుంటున్న మెటా

    2020లోనే మెటా రాజా సింగ్‌పై నిషేధం విధించినా ఆయన మద్దతుదారులు కొత్త గ్రూపులు, పేజీలను సృష్టిస్తూ ఆయన ప్రసంగాలను, కార్యాకలాపాలను విస్తృతంగా షేర్‌ చేయడాన్ని కొనసాగించారు.

    అయితే ఇటీవల రాజా సింగ్ చేసిన కొన్ని పోస్టులు మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఇవే మెటా చర్యలకు దారితీసినట్లు తెలుస్తోంది.

    IHL నివేదిక ప్రకారం 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఏప్రిల్‌ - జూన్ మధ్య బీజేపీ సీనియర్‌ నేతలు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం చేశారు.

    ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ప్రసంగాల్లో 74.5శాతం హేట్‌ స్పీచ్‌గా గుర్తింపు పొందింది.

    Details

    రాజా సింగ్ ప్రతిస్పందన 

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తొలగించడంపై రాజా సింగ్ తీవ్రంగా స్పందించారు.

    ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్‌ దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు.

    తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఖాతాలను కూడా బ్లాక్‌ చేయడం దురదృష్టకరమని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోషామహల్
    మెటా

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    గోషామహల్

    రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి టి. రాజాసింగ్
    రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్‌ ఎత్తివేత..? బీజేపీ
    BJP: ప్రొటెం స్పీకర్‌ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు  అక్బరుద్దీన్ ఒవైసీ
    Bjp Mla-Raja singh-Case: ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదు బీజేపీ

    మెటా

    Meta: కొత్త ఫీచర్‌ లతో బహుళ ప్రయోజనాలు అందిస్తున్న Messenger ప్లాట్‌ఫారమ్‌ టెక్నాలజీ
     Meta's Messenger: వాట్సాప్ లాంటి 'కమ్యూనిటీస్' ఫీచర్‌ను తీసుకువచ్చిన మెటా మెస్సెంజర్.. అది ఎలా పని చేస్తుందంటే? టెక్నాలజీ
    EU: ఆపిల్,మెటా చట్టం ప్రకారం నడవాలంటున్న యూరోపియన్ కమిషన్  ఆపిల్
    Meta: మెటా థ్రెడ్‌ల కోసం API ప్రారంభం.. డెవలపర్‌లను వినియోగించుకోండన్న జుకర్‌బర్గ్ థ్రెడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025