Page Loader
Guwahati: తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే.. షాక్ అయ్యిన పోలీసులు 
తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే.. షాక్ అయ్యిన పోలీసులు

Guwahati: తల్లి మృతదేహంతో మూడు నెలలుగా ఇంట్లోనే.. షాక్ అయ్యిన పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 22, 2024
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలోని గౌహతిలో ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. మూడు నెలలుగా తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో ఉంటున్న కుమారునికి సంబందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ సంఘటన గౌహతిలోని జ్యోతికుచి ప్రాంతంలో జరిగింది. మృతురాలిని పూర్ణిమా దేవి (75)గా గుర్తించారు. ఆమె మూడు నెలల క్రితం మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పూర్ణిమా దేవి తన కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఇంట్లో నివసిస్తూ ఉంది. స్థానికుల ప్రకారం, జైదీప్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.

వివరాలు 

దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

పోలీసులు మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, జైదీప్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ఇంట్లో ఆధారాలు సేకరించారు. జైదీప్‌తో పాటు అతని మామ, అమ్మమ్మలను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంటి సమీపంలో నివసిస్తున్న వారు మీడియాతో మాట్లాడుతూ, జైదీప్‌ మానసికంగా సరిగా లేడని, అతని ప్రవర్తన చాలా వింతగా ఉండేదని చెప్పారు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, జైదీప్ తన తల్లిని ఇంట్లోనుంచి బయటకు రానివ్వలేదని, ఎవరు అడిగినా ఆమె ఆరోగ్యంగా ఉందని చెబుతుండేవాడని వివరించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.