NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..
    తదుపరి వార్తా కథనం
    Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..
    కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

    Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    09:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది.

    ఈ క్రమంలో 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన "సింధు జలాల ఒప్పందం"ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

    అలాగే అటారీ-వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి స్పష్టం చేశారు.

    ఈ కీలక నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో నిర్వహించిన సీసీఎస్ (భద్రతపై కాబినెట్ కమిటీ) భేటీ అనంతరం వెలువడ్డాయి.

    వివరాలు 

     రాయబార కార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గింపు 

    ఇంకా భారత్ పాకిస్తాన్‌తో అన్ని రకాల దౌత్య సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.

    భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు రెండు రోజులలోపు దేశాన్ని విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

    అంతేకాకుండా, ఇప్పటికే జారీ చేసిన పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

    ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయ సిబ్బందిని 55 నుండి 30కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

    అదేవిధంగా, ఆ కార్యాలయంలో పని చేస్తున్న సైనిక సలహాదారులు భారత్‌ను విడిచి వెళ్లాల్సిందిగా సూచించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న విక్రమ్‌ మిస్రీ 

    #WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "Recognising the seriousness of this terrorist attack, the Cabinet Committee on Security (CCS) decided upon the following measures- The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan… pic.twitter.com/PxEPrrK1G8

    — ANI (@ANI) April 23, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా

    కేంద్ర ప్రభుత్వం

    Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు భారతదేశం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం తెలంగాణ
    Budget 2025 : ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో బీమా కవరేజీ పెంపు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవైపై కేంద్రం దృష్టి! బడ్జెట్
    Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు  నందమూరి బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025