Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థత.. ఎయిమ్స్లో వైద్య పరీక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను సోమవారం చేర్పించినట్లు అధికారులు తెలిపారు. గత వారాంతంలో ఆయన రెండుసార్లు స్పృహ కోల్పోయిన నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్కు తరలించారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం, 74 ఏళ్ల ధన్కర్కు జనవరి 10న ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత వైద్యులు పరిశీలించి, మరింత పరీక్షలు అవసరమని భావించి ఆస్పత్రిలో చేర్పించాలని నిర్ణయించారు. ఆరోగ్య కారణాలతోనే గతేడాది జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా అప్పట్లో అకస్మాత్తుగా జరగడంతో అనేక ఊహాగానాలకు దారి తీసింది. రాజీనామా అనంతరం ఆయన ప్రజా కార్యక్రమాల్లో చాలా అరుదుగా మాత్రమే పాల్గొన్నారు.
వివరాలు
పరీక్షల కోసం అడ్మిట్ కావాలని ఎయిమ్స్ డాక్టర్ల సూచన
అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, శనివారం రోజున వాష్రూమ్కు వెళ్లిన సమయంలో ధన్కర్కు రెండు సార్లు స్పృహ తప్పింది. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. "ఈ రోజు చెకప్ కోసం ఎయిమ్స్కు వెళ్లగా, డాక్టర్లు పరీక్షల కోసం అడ్మిట్ కావాలని సూచించారు" అని ఓ అధికారి పీటీఐకి తెలిపారు. వైద్య పరీక్షలలో భాగంగా ఎంఆర్ఐ స్కాన్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇటీవల రాన్ ఆఫ్ కచ్, ఉత్తరాఖండ్, కేరళ, అలాగే జాతీయ రాజధానిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో కూడా ధన్కర్కు స్పృహ కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ధన్కర్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆరోగ్య సమస్యలు.. ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న జగదీప్ ధన్కర్
पूर्व उपराष्ट्रपति जगदीप धनखड़ एम्स में भर्ती
— POLITICIANS INDIA (@PI_official1008) January 12, 2026
पिछले सप्ताह दो बार हुए थे बेहोश#jagdeepdhankar #aiims #expresident pic.twitter.com/ND3nUTjsrC