NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు 
    తదుపరి వార్తా కథనం
    Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు 
    బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు

    Bengaluru Techie Suicide Case: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. న్యాయమూర్తి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి ఆరోపణులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు టెకీ ఆత్మహత్య తరువాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ సందర్భంగా, అతుల్ సుభాష్ తండ్రి తన కొడుకులు జీవితం ముగించుకున్న కారణంగా భార్య, ఆమె బంధువుల వేధింపులను తట్టుకోలేకపోయాడని విచారం వ్యక్తం చేశారు.

    అతని వాదన ప్రకారం, భార్య తనపై వేసిన కేసుల నుండి విముక్తి పొందేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి అతుల్ సుభాష్ నుండి డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు.

    అతుల్ సుభాష్, నిఖిత సింఘానియా 2019లో వివాహం చేసుకున్నారు.

    కానీ, కొన్ని సంవత్సరాల తరువాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు అతుల్ తండ్రి పవన్ కుమార్ వెల్లడించారు.

    దీని తరువాత నిఖిత, సుభాష్‌ను విడిచి బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్ కు వెళ్లింది.

    వివరాలు 

    రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి డిమాండ్

    అక్కడ ఆమె తల్లి, సోదరితో కలిసి అతుల్ పై అనేక అప్రాధిక కేసులు పెట్టింది.

    ఈ కేసుల విచారణ కోసం అతుల్ 40కి పైగా సార్లు బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లి వచ్చాడని అతని తండ్రి తెలిపారు.

    ఇక, న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతుండగా, పర్యవేక్షణ చేస్తున్న జడ్జి సమస్యను పరిష్కరించడానికి రూ.5 లక్షలు అడిగినట్లు పవన్ కుమార్ ఆరోపించారు.

    దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము రెడీనట్లు చెప్పుకొచ్చారు. మొదట రూ.20 వేల డిమాండ్ చేసి, ఆపై అది రూ.40 వేలకు పెంచారని ఆయన పేర్కొన్నారు.

    చివరకు, సెటిల్మెంట్ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని జడ్జి డిమాండ్ చేశాడని పవన్ కుమార్ వివరించారు.

    వివరాలు 

    బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు 

    ఈ నేపథ్యంలో, బెంగళూరు మారతహళ్లి పోలీసులు అతుల్ సుభాష్ మృతికి సంబంధించిన దర్యాప్తును వేగంగా సాగిస్తున్నారు.

    మృతుని సోదరుడు బికాస్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    నిందితుల కోసం యూపీలోని జౌన్‌పూర్ ప్రాంతానికి వెళ్లి, నిఖిత సింఘానియా, ఆమె తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్ కోసం గాలించారు.

    మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా బిహార్‌లో పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బెంగళూరు

    బెంగళూరు హాస్టల్‌లో మహిళ హత్య.. మధ్యప్రదేశ్‌లో నిందితుడు అరెస్టు మధ్యప్రదేశ్
    Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత! ఇండియా
    Newly weds Died: విషాదం..పెళ్లయిన గంటల్లోనే నవదంపతుల మృతి కర్ణాటక
    Bengaluru: లేడిస్ వాష్‌రూంలో మొబైల్.. రికార్డు అవుతుండగా చూసి షాకైన మహిళ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025