Page Loader
Mlc Kavitha Petition: సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్

Mlc Kavitha Petition: సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్

వ్రాసిన వారు Stalin
Apr 06, 2024
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి తీహార్ జైలులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ అనుమతినించవద్దని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తమకు అనుకూలమైన కోర్టు ఉత్తర్వులు పొందేందుకు సీబీఐ వాస్తవాలను తప్పుగా చూపించి ఉండొచ్చని ఎమ్మెల్సీ కవిత తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. తన తరఫు వాదనలు వినిపించే వరకు ఉత్తర్వులను నిలిపివేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కవిత దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించేందుకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సీబీఐకు ఈనెల 10 వరకు గడువిచ్చారు.

Kavitha petition in rouse Avenue court

ఆమ్​ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారు: సీబీఐ

కవిత తరపున న్యాయవాది దీపక్ నగర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా...కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, న్యాయవాది నితేష్ రాణాలు కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు శుక్రవారం ఢిల్లీ కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది. బుచ్చిబాబు ఫోన్‌లో వాట్సాప్ చాట్‌లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ముడుపులు చెల్లించినట్లు ఆరోపించిన భూమి ఒప్పందంకు సంబంధించిన పత్రాల నుంచి స్వాధీనం చేసుకున్న వాట్సాప్ చాట్‌లకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను విచారించడానికి సీబీఐ కోర్టు అనుమతిని కోరిన సంగతి తెలిసిందే.