Page Loader
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు
చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు

చీఫ్ సెక్రటరీని తొలగించాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ సిఫార్సు

వ్రాసిన వారు Stalin
Nov 15, 2023
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై విజిలెన్స్‌ మంత్రి అతిషి సమర్పించిన ప్రాథమిక నివేదికను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పంపారు. ఈమేరకు మంత్రి అతిశీ మంగళవారం ముఖ్యమంత్రికి 670 పేజీల నివేదికను సమర్పించారు. ప్రధాన కార్యదర్శి తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్రమ లబ్ధి చేకూర్చినట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను సీబీఐ, ఈడీకి కూడా పంపాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చిన కేసులో కేజ్రీవాల్ ఆదేశాల మేరకు దిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి నవంబర్ 11న దర్యాప్తుకు ఆదేశించారు.

దిల్లీ

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే భూసేకరణలో అవకతవకలు

ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే కోసం భూసేకరణలో సీఎస్ అవకతవకలకు పాల్పడినట్లు కేజ్రీవాల్‌కు ఫిర్యాదు అందింది. తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల లాభం చేకూర్చినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై చీఫ్ సెక్రటరీ కూడా స్పందించారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేశారు. 2015లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని భూమిని కేవలం రూ.75 లక్షలకు కొనుగోలు సీఎస్‌కు చెందిన కుమారుడి కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత చాలా ఎక్కువ ధరకు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణ కోసం ఆ భూమిని దిల్లీ ప్రభుత్వం సేకరించింది. దీనికి కారణంగా సీఎస్ కుమారుడికి 850 కోట్ల రూపాయల అక్రమ లాభం వచ్చిందని, ఈ డీల్‌కు వెనుక సీఎస్ ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.