NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ
    తదుపరి వార్తా కథనం
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ
    నా ఆస్తులకు వారుసుడు రుచిర్: లలిత్ మోదీ

    నా ఆస్తులకు వారుసుడు రుచిర్, తక్షణమే అమల్లోకి వస్తుంది: లలిత్ మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రకటన చేశారు. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన ఆయన.. ట్విట్టర్ వేదికగా తన ఆస్థులకు వారసుడిగా కుమారుడు రుచిర్ మోదీని ప్రకటించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది చెప్పారు.

    లలితే మోదీ కుటుంబ ఆస్తులన్నీ 'కేకే మోదీ ఫ్యామిలీ ట్రస్ట్' ఆధీనంలో ఉన్నాయి. లలిత్ మోదీ ఆ ట్రస్టులో సభ్యుడు. ట్రస్ట్ ఆస్తులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. తల్లి, సోదరితో ఆస్తికోసం కోర్టులో లలిత్ మోదీ పోరాడుతున్నారు. తన సోదరి, తల్లితో ఇప్పటికే అనేక సార్లు చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ఇది చాలా బాధాకరమని లలిత్ మోదీ పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తూ లలిత్ మోదీ చేసిన ట్వీట్

    l In light of what I have gone thru, it’s time to retire and move on. And groom my kids. I am handing them all. 😀🥰 pic.twitter.com/DihwLqJd5e

    — Lalit Kumar Modi (@LalitKModi) January 15, 2023

    లలిత్ మోదీ

    కుమార్తెతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా: మోదీ

    తన కొడుకును వారసుడిగా నియమించే విషయం కుమార్తె అలియాతో కూడా చర్చించినట్లు ఈ సందర్భంగా లలిత్ మోదీ చెప్పారు. ట్రస్టు సభ్యుడిగా తన స్థానంతో తన కుమారుడు రుచిర్ మోదీని సిఫార్సు చేసినట్లు వివరించారు. ట్రస్ట్ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలన్నీ తన కుమారుడికే దక్కాలని చెప్పారు.

    'కేకే మోదీ ఫ్యామిలీ ట్రస్ట్' డీడ్‌లోని ఒక క్లాజ్‌ను ఉటంకిస్తూ.. కేకేఎంఎఫ్టీలోని ఎల్‌కేఎం బ్రాంచ్ తదుపరి అధిపతిగా తన కుమారుడు రుచిర్ మోడీని నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. తాను ఫ్యామిలీ ట్రస్ట్ లబ్ధిదారుని పదవికి రాజీనామా చేస్తున్న్టట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    భారతదేశం
    గుజరాత్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఐపీఎల్

    ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ రోహిత్ శర్మ
    దాదా ఈజ్ బ్యాక్.. ఐపీఎల్‌లోకి గంగూలీ రీ ఎంట్రీ క్రికెట్
    ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు క్రికెట్

    భారతదేశం

    మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మారుతీ-సుజుకి NEXA బ్లాక్ ఎడిషన్ మోడల్స్ ఆటో మొబైల్
    డిసెంబరులో దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 15 శాతం పెరుగుదల ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కాబోతున్న MBP C1002V క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఆటో మొబైల్
    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు క్రికెట్

    గుజరాత్

    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ నరేంద్ర మోదీ
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025