NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా
    తదుపరి వార్తా కథనం
    Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా
    కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా

    Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    08:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైన లేదా పరిశుభ్రత కంటే తక్కువ స్థాయిలో ఉన్న హోటల్‌లో తింటున్నారా?

    వేడిగా పొగలు వస్తున్నాయి కాబట్టి బిర్యానీని ఆశగా తింటున్నారా? చిన్నపాటి దుకాణంలో స్వీట్లు కొనుకుని తింటున్నారా? అలా చేస్తే, మీ ఆరోగ్యానికి ప్రమాదం తప్పదు!

    ఎందుకంటే, ఆ ఆహార పదార్థాల్లో వాడిన నెయ్యి లేదా నూనె కుళ్లిన జంతువ్యర్థాలతో తయారు చేసే అవకాశముంది.

    ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా! ఇలాంటి ఆహారం తీసుకుంటే, శరీరంలోని అనేక ముఖ్యమైన అవయవాల పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    వివరాలు 

    పెద్ద ఎత్తున జరుగుతున్న కల్తీ దందా గురించి 

    జంతువుల వ్యర్థాలతో కల్తీ చేసిన నెయ్యి, వంటనూనెలను తయారు చేసి విక్రయించడం ద్వారా కొందరు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం మీద ముప్పు కలిగిస్తున్నారు.

    ఈ కల్తీ ఉత్పత్తులను ప్రఖ్యాత కంపెనీల నెయ్యి, వంటనూనెల్లో కలిపి మార్కెట్‌లో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.

    ముఖ్యంగా హైదరాబాద్ నగరం,చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా విస్తృతంగా జరుగుతోంది.

    పోలీసులకు ఈ వ్యవహారం తెలిసినా,కొందరు మామూళ్లకు లోనై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.

    అంతేకాకుండా,కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలను తరచూ,ప్రతి 15రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలని సలహా ఇస్తున్నట్లు సమాచారం.

    తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కల్తీ ఉత్పత్తులపై దృష్టి పెట్టిన 'ప్రముఖ దినపత్రిక' అనేక నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది.

    వివరాలు 

    గోప్యంగా  దందా 

    హైదరాబాద్ నగరంలో చాలా ఏళ్లుగా ఈ దందా గోప్యంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అలీనగర్, హాసన్‌నగర్, ప్రగతినగర్ కాలనీ వెనుక ప్రాంతాల్లో, శాస్త్రిపురం రైల్వే స్టేషన్ పొడవునా అనేక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నాయి.

    వాటితో పాటు, జల్‌పల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, పరిగి రోడ్డు, కడ్తాల్, పటాన్‌చెరు వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు ఉన్నాయని తెలుస్తోంది.

    ఈ కేంద్రాలు కొండలు, గుట్టల మధ్య నమ్మశక్యం కాని ప్రాంతాల్లో ఉంటాయి. ప్రతి నెలకు ఒకసారి వీటిని వేరే ప్రాంతాలకు మార్చి దందా కొనసాగిస్తున్నారు.

    వివరాలు 

    తయారీ విధానం 

    గొడ్డు మాంసం వ్యర్థాలు ఎక్కువగా ఉండే ఈ ప్రక్రియలో, మొదటగా ఆ వ్యర్థాలను రెండు రోజులు వదిలేస్తారు.

    ఈ సమయానికీ, అవి కుళ్లిపోయి పెద్దపెద్ద పురుగులు పుట్టుకొస్తాయి. ఆ తరవాత, ఈ కుళ్లిన వ్యర్థాలను 3-4 టన్నుల బాండీల్లో వేస్తారు.2-3 రోజుల పాటు నిరంతరం మరిగిస్తారు.

    ఈ మరిగింపు వల్ల వ్యర్థాల్లోని ఎముకలు, ఇతర భాగాలు కరిగి, పేస్టులా మారతాయి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి, 20 లేదా 40 లీటర్ల డబ్బాల్లో పోస్తారు.

    అటుపై, పాతబస్తీలోని పాత డబ్బాలు,స్టిక్కర్లు సేకరించి,వాటి మీద ప్రసిద్ధ కంపెనీల స్టిక్కర్లు అతికిస్తారు.

    ఆ తరువాత ఈ డబ్బాలను విక్రయానికి పంపిస్తారు.వీటిలో 20 లీటర్ల డబ్బా కేవలం రూ.300కే అమ్ముతారు.

    వివరాలు 

    నకిలీ నెయ్యిలో రసాయనాలు

    ఈ డబ్బాలు రవాణా అవుతూ,పలు వ్యక్తుల ద్వారా హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు చేరుకుంటాయి.

    పేరొందిన ప్రముఖ కంపెనీల నెయ్యి, నూనెలలో వ్యాపారులు ఈ నకిలీ నెయ్యి, నూనెలను కొంత మిశ్రమంగా కలుపుతారు.

    నకిలీ నెయ్యి ఉండటం గుర్తించకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలు కలిపి తయారు చేస్తారు.

    వీధి వ్యాపారులు కూడా ఈ నకిలీ నెయ్యి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. బిర్యానీ, వీధి వంటకాలలో ఈ నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

    ఈ కల్తీ నెయ్యి పుణె, ముంబై, ఇతర ప్రాంతాలకు కూడా రవాణా అవుతోంది. ఒక్కో తయారీ కేంద్రంలో వారానికి సుమారు 50-60 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది.

    వివరాలు 

    తూతూమంత్రంగా సోదాలు 

    జంతు వ్యర్థాలతో నకిలీ నెయ్యి తయారీ జరుగుతున్న విషయాన్ని పోలీసులకు తెలిసినా, తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

    రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా, అప్పుడప్పుడు కొన్నిచోట్ల తనిఖీలు జరిపి వదిలేస్తున్నారు.

    కొన్ని పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ఈ తయారీదారులు కొంత మొత్తాన్ని అందిస్తున్నారని సమాచారం ఉంది.

    ఒక్కో తయారీ కేంద్రంలో సుమారు 15-25 మంది పని చేస్తున్నారు. 24 గంటల పాటు పనిచేసిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున వేతనం ఇస్తున్నారు.

    వివరాలు 

    ఆకస్మిక హృద్రోగ మరణాలు

    కల్తీ నెయ్యి,నూనెలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తింటే, హృద్రోగాలు, పక్షవాతం వంటి సమస్యలతో పాటు, ఉదరకోశ, పెద్దపేగు క్యాన్సర్‌లకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది.

    ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది. టేప్‌ వర్మ్, సిస్టోసర్కోసిస్‌ వంటి పరాన్నజీవులు 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడిచేసినా చనిపోవు.

    ఇవి మన శరీరంలోని మెదడు, కాలేయం, పేగుల్లోకి చేరి, మూత్రపిండాలు, కాలేయం, ఇతర అవయవాలను దెబ్బతీస్తాయి.

    గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడంతో ఆకస్మిక హృద్రోగ మరణాలు సంభవిస్తాయి.

    మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడటం వల్ల బ్రెయిన్‌ హెమరేజ్‌,పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల చేతులు, కాళ్లు, మాట పడిపోయే ప్రమాదం ఉంది.

    వివరాలు 

    కల్తీ నూనెతో కిడ్నీ ఫెయిల్యూర్‌

    కల్తీ నూనెల రంగు, వాసన సాధారణ నూనెల్లా ఉండేందుకు రసాయనాలు కలుపుతారు. ఇవి శరీరంలో త్వరగా జీర్ణం కావు.

    ఈ రసాయనాలు శరీరంలో విష పదార్థాలను వడపోసే కాలేయాన్ని దెబ్బతీస్తాయి, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా కారణమవుతాయి.

    ఇలాంటి నూనెలను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఈ కల్తీ నూనెలతో చేసిన పదార్థాలను తిని.. కల్తీ నూనెను సులభంగా గుర్తించడం కష్టంగా ఉంటుంది,కాబట్టి ల్యాబ్ పరీక్షల ద్వారానే ఇది తెలిసే అవకాశం ఉంది.

    రోడ్లపక్కన లేదా పరిశుభ్రత లేని హోటళ్లలో తినడం మంచిది కాదు. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడమే ఆరోగ్యానికి మేలని భావించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    హైదరాబాద్

    హీరో నాగార్జునకు భారీ ఊరట.. కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు నాగార్జున
    Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి
    Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక తెలంగాణ
    Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్! చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025