NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక 
    ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక

    Mamata Banerjee: ఓటర్ల జాబితా సరిచేయకపోతే నిరవధిక దీక్ష చేస్తా : మమతా బెనర్జీ హెచ్చరిక 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా విషయంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

    ఎన్నికల సంఘం సహకారంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను జాబితాలో చేర్పిస్తున్నట్లు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.

    తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే, ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతానని హెచ్చరించారు.

    నకిలీ ఓటర్ల చేర్పు-దీదీ ఆందోళన

    భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియామకాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ ప్రభావంలో ఉందని ఆరోపించారు.

    2006లో భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను గుర్తు చేస్తూ, ఓటర్ల జాబితాను సరిచేయాలని, తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు.

    Details

    హరియాణా, గుజరాత్‌ ఓటర్లు బెంగాల్‌లో?

    ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు హరియాణా, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను పశ్చిమ బెంగాల్‌ ఓటర్ల జాబితాలో చేర్చుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.

    ఇదే వ్యూహాన్ని బీజేపీ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ అమలు చేసిందని వ్యాఖ్యానించారు.

    స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవలేదని అందుకే తప్పుడు జాబితా రూపొందిస్తున్నట్లు ఆరోపించారు.

    Details

    బీజేపీ వ్యూహంపై దీదీ ఘాటు వ్యాఖ్యలు 

    బీజేపీ, పశ్చిమ బెంగాల్‌ను హస్తగతం చేసుకోవాలని చూస్తోందని, కానీ తృణమూల్ కాంగ్రెస్ అలా జరగనివ్వదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

    రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 215 స్థానాల్లో తృణమూల్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

    ఈ విషయంలో ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరవధిక దీక్షకు సిద్ధమని మమతా బెనర్జీ హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మమతా బెనర్జీ
    పశ్చిమ బెంగాల్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    మమతా బెనర్జీ

    Mamata Benarjee: రామమందిరం వేడుకకు మమతా బెనర్జీ దూరం? భారతదేశం
    Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!  అయోధ్య
    Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్
    Mamata Banerjee: కాంగ్రెస్‌కు షాక్.. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ  కాంగ్రెస్

    పశ్చిమ బెంగాల్

    Bird flu in India భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసు..నిర్దారించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ .. 2019 నుండి 2వ కేసు భారతదేశం
    WestBengal: పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. సిలిగురిలో గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ఢీ  రైలు ప్రమాదం
    CV Ananda Bose: రాజ్‌భవన్‌ను ఖాళీ చేయమని డ్యూటీ పోలీసులను కోరిన బెంగాల్ గవర్నర్  గవర్నర్
    Faulty signal: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమేమిటి? రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025