Page Loader
Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ కన్నుమూత

Sheikh Sabji: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్సీ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2023
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ (PDF) షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలో పాల్గొని ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఆయన కారును మరో వాహనం ఢీకొట్టింది.

Details

మరో నలుగురికి తీవ్ర గాయాలు

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్సీని ఆస్పత్రికి తీసుకెళ్తుతుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.