LOADING...
Noida: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కారును తగలబెట్టిన కార్మికులు
నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కారును తగలబెట్టిన కార్మికులు

Noida: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కారును తగలబెట్టిన కార్మికులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నోయిడా ఫేజ్-2లో ఉన్న ఆ సంస్థ వద్ద వందలాది మంది కార్మికులు గుమికూడి, జీతాల పెంపు కోసం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఆవేశానికి లోనై సంస్థ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఒక కారుకు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా, ఫ్యాక్టరీ భవనంపై దాడి చేయడంతో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులపై రాళ్లు విసిరారు.

వివరాలు 

పోలీసులు, కార్మికులు స్వల్ప గాయాలు

పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. లాఠీచార్జ్ నిర్వహించి, బాష్ప వాయువు ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు, కార్మికులు స్వల్ప గాయాలు అయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. హింసకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ప్రత్యేక దళాలతో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నోయిడాలో ఉద్రిక్తత.. భారీగా పోలీసులు మోహరింపు

Advertisement