NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 
    తదుపరి వార్తా కథనం
    Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 
    జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్

    Katra Ropeway Project: జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి రోప్‌వే నిర్మాణానికి వ్యతిరేకంగా కాట్రాలో72 గంటల పాటు బంద్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బేస్‌క్యాంప్‌ అయిన కాట్రా పట్టణంలో ప్రతిపాదిత రోప్‌వే నిర్మాణ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

    బుధవారం నుండి 72 గంటల పాటు పట్టణం మొత్తం బంద్‌ పిలుపునిచ్చారు.

    ఈ సందర్భంగా, నిరసన చేస్తున్న వారిని అడ్డుకోవడానికి పోలీసులు రంగంలో దిగడంతో, పలు చోట్ల ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

    అయితే, వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులు చేరుకోవడానికి 13 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్‌ను చేస్తారు.

    అయితే, పిల్లలు, వృద్ధులు ఈ ట్రెక్కింగ్‌ను చేయడం చాలా కష్టంగా మారడంతో.. దీన్ని సులభంగా చేయడానికి ₹250 కోట్లతో రోప్‌వే ప్రాజెక్టును నిర్మించాలని పుణ్యక్షేత్ర బోర్డు నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    వైష్ణోదేవి సంఘర్ష్‌ సమితి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 

    ఈ బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కాట్రా పట్టణంలో బంద్‌ పిలుపునిచ్చిన శ్రీ మాతా వైష్ణోదేవి సంఘర్ష్‌ సమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

    వారు ఈ రోప్‌వే ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.

    ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ, ప్రభుత్వంతో చర్చలు జరపడం కంటే, పోలీసుల్ని ప్రయోగించి తమను నిర్బంధించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

    మరోవైపు, బంద్‌ పిలుపు కారణంగా పట్టణంలోని వ్యాపార సంస్థలు మూతపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    నిరసనకు ఇది సరైన సమయం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం భారతదేశం
    Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన  శ్రీనగర్
    Jammu and Kashmir Elections 2024: జమ్ముకశ్మీర్'లో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?  భారతదేశం
    Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025