LOADING...
Maharastra: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి

Maharastra: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సమయానికి ఉదయం 8.45 గంటలకు ఈ ఘోర ఘటన చోటు చేసిందని అధికారులు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం, సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపుతప్పి క్రాష్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నంలోనే విమానం కూలిపోగా,వెంటనే తీవ్రమైన మంటలు చెలరేగాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అజిత్‌ పవార్‌ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం

Advertisement