NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ
    మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ

    మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Jul 04, 2023
    11:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

    జులై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది.

    2024ఎన్నికలకు బదులుగా 2047పై ఫోకస్ పెట్టాలని మోదీ సూచించారు. 2047లో భారత్ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్నట్లు చెప్పారు.

    ఆ నాటికి అనేక రంగాల్లో భారతదేశ వృద్ధిని పెంపొందించే లక్ష్యంతో పని చేయాలని మోదీ తన మంత్రి మండలిని కోరారు.

    భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో రాబోయే 25ఏళ్ల కాలాన్ని 'అమృత్ కాల్'గా ప్రధాని మోదీ అభివర్ణించిన విషయం తెలిసిందే.

    మోదీ

    తొమ్మిదేళ్లలో ఏం చేశామో ఈ తొమ్మిది నెలల్లో ప్రజలకు చెప్పండి: మోదీ

    వచ్చే 25 సంవత్సరాల్లో దేశంలో చాలా మార్పులు వస్తాయని మోదీ వెల్లడించారు.

    భారతదేశం ఉన్నత విద్యావంతులైన శ్రామిక శక్తి కలిగి ఉంటుందని, వివిధ రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆవిర్భావానికి ఈ నేల సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు.

    ఈ సమావేశంలో అన్ని మంత్రిత్వ శాఖలు రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి రోడ్ మ్యాప్‌పై ప్రజెంటేషన్ ఇచ్చాయని పీటీఐ వార్తాసంస్థ నివేదించింది.

    తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని, ఆ పనుల గురించి ప్రజలకు తెలియజేసేందుకు వచ్చే తొమ్మిది నెలలను ఉపయోగించుకోవాలని ప్రధాని కోరారు.

    మంత్రులు తమ మంత్రిత్వ శాఖల 12 ప్రధాన విజయాలు, పథకాలతో క్యాలెండర్ తయారు చేయాలని మోదీ సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    కేంద్రమంత్రి
    ప్రధాన మంత్రి

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    గోరఖ్‌పూర్‌ గీతాప్రెస్‌కు ప్రతిష్ట్మాకమైన గాంధీ శాంతి పురస్కారం  ఉత్తర్‌ప్రదేశ్
    అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ  అమెరికా
    వెజ్ వెరైటీలు, గ్రామీ విజేత వయోలిన్; ప్రధాని మోదీ కోసం వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు అమెరికా
    మా అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నం: మోదీ యూఎస్ పర్యటనపై చైనా కామెంట్స్  చైనా

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం

    ప్రధాన మంత్రి

    Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు భారతదేశం
    కాంగ్రెస్ పాలనలోనే మహిళలపై నేరాలు అధికం; రాజస్థాన్‌లో ప్రధాని మోదీ ఫైర్  నరేంద్ర మోదీ
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కటక్ లో ప్రధాని మోదీ.. బాధితులకు పరామర్శ.. ఆదుకుంటామని భరోసా నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025