NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం
    భారతదేశం

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 03, 2023, 10:17 am 1 నిమి చదవండి
    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం
    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ రెండురోజుల పర్యటన

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మంగళవారం, బుధవారం పర్యటించనున్నారు. తవాంగ్ సెక్టార్‌లోని ఎల్‌ఎసీ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. రాజ్‌నాథ్‌సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ)కు చెందిన 27 ప్రాజెక్టులతో సహా సరిహద్దులోని కీలకంగా భావిస్తున్న సియోమ్ వంతెనను బుధవారం రాజ్‌నాథ్ ప్రారంభించనున్నారు. రాజ్‌నాథ్ సింగ్ పర్యటనలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భవిష్యత్ ప్రణాళికతోపాటు, న్యూ టెక్ హ్యాండ్‌బుక్‌ను విడుదల చేయనున్నారు. అలాగే స్థానిక ప్రజలతో రక్షణ మంత్రి సమావేశం కానున్నారు.

    100 మీటర్ల పొడవుతో సియోమ్ వంతెన నిర్మాణం

    అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనలో రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించే సియోమ్ వంతెన‌ చాలా కీలకమైనది. సియోమ్ నదిపై ఈ వంతెనను 100 మీటర్ల పొడవుతో నిర్మించారు. చైనా సరిహద్దులో వ్యూహాత్మకంగా ఈ వంతెనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించింది. భారత్- చైనా సరిహద్దులోని వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ వెంబడి త్వరితగతిన ద‌ళాల‌ను మోహరించడానికి సియోమ్ వంతెన‌ ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత ఐదేళ్లలో దాదాపు 3,097 కిలోమీట‌ర్ల రోడ్ల‌ను నిర్మించడం గమనార్హం. డిసెంబర్ 9న త‌వాంగ్ సెక్టార్‌లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత.. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఎల్ఏసీ విషయంలో చైనా ఏక పక్షంగా వ్యవహరిస్తోందంటూ.. చైనాపై భారత్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    అరుణాచల్ ప్రదేశ్
    రాజ్‌నాథ్ సింగ్
    చైనా

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    అరుణాచల్ ప్రదేశ్

    అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు హెలికాప్టర్‌
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం చైనా
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు

    రాజ్‌నాథ్ సింగ్

    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    చైనా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    వచ్చే వారం రష్యాకు జిన్‌పింగ్; జెలెన్‌స్కీ- పుతిన్ మధ్య సంధి కుదురుస్తారా? రష్యా

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023