Rajnath Singh: బెంగాల్పై కన్నేస్తే.. మళ్లీ 1971 గుర్తు చేస్తాం.. పాక్కు రాజ్నాథ్ సింగ్ అల్టిమేటం
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. భారత్ భవిష్యత్తులో ఏదైనా దాడి చేస్తే, కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన చేసిన ప్రకటనలపై రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పాక్ రక్షణ మంత్రిని హెచ్చరించారు.
వివరాలు
ఇంకోసారి అలా మాట్లాడితే చరిత్ర రిపీట్
అలాగే, సుమారు 55 ఏళ్ల క్రితం జరిగిన పరిణామాలను గుర్తుచేశారు. 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్ రెండు భాగాలుగా విడిపోయిందని పేర్కొన్నారు. తూర్పు పాకిస్థాన్ విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిందని వివరించారు. ఆ సమయంలో భారత సైన్యం బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచిందని తెలిపారు. ఆ యుద్ధం తర్వాత పాకిస్థాన్ అనేక ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న విషయాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా, పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచే విధంగా వ్యాఖ్యలు చేయకుండా ఇస్లామాబాద్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బెంగాల్పై దృష్టి పెట్టితే ఈసారి పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.