NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల
    అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల
    భారతదేశం

    అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల

    వ్రాసిన వారు Naveen Stalin
    April 26, 2023 | 03:23 pm 0 నిమి చదవండి
    అయ్యో! సైబీరియన్ పక్షలకు ఎంత కష్టమొచ్చే; వడగండ్లతో విలవిల
    ప్రతికూల వాతావరణానికి చనిపోతున్న సైబీరియన్ వలస పక్షులు

    తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతి ఏటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు అకాల వర్షాలు, వడగళ్ల వానలకు అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా వడగళ్ల వానల వలన మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులో వచ్చి గూళ్లు కట్టుకుని పిల్లలను పెంచి జులైలో వెళ్లిపోయే ఈ పక్షులకు మాధాపురం ప్రసిద్ధి. ఈ పక్షులను ఇక్కడి ప్రజలు చాలా సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ పక్షలు వస్తే ఆ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి ఏటా వలస వచ్చే ఆ పక్షులను ఏం అనకుండా అతిథులుగా వాటిని గ్రామస్థులు చూసుకుంటారు.

    వడగళ్ల వానలకు పిల్లలను రక్షించుకునేందుకు పక్షుల తాపత్రయం

    అయితే గత కొన్ని రోజులుగా ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సైబీరియన్ పక్షులు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వడగళ్ల వానలకు తమ పిల్లలను రక్షించుకునేందుకు తాపత్రయపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మృత్యువాత పడ్డాయి. గ్రామానికి సుభసూచికంగా భావించే పక్షులు మృతి చెందడంతో స్థానికులు అయ్యో పాపం అంటున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినా, ఇలా వడగళ్ల వానలు పడటం చాలా అరుదని స్థానికులు చెబుతున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    తాజా వార్తలు

    తెలంగాణ

    Hyderabad Metro: ఆ రూట్లలో షార్ట్ లూప్ ట్రిప్పులను నడుపుతున్న హైదరాబాద్ మెట్రో  హైదరాబాద్
    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    గ్రేటర్ హైదరాబాద్‌లో నీటి కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 'నాణ్యత' యాప్  హైదరాబాద్
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  సచివాలయం

    తాజా వార్తలు

    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం సింగపూర్
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023