NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు 
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు 
    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు

    తెలుగు రాష్ట్రాల్లో మామిడి రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు 

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలు మామిడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

    వాస్తవానికి మామిడి కాయల తడిచినా, మచ్చలు వచ్చినా మార్కెట్లో వాటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపరు. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు కాయలు ఎదగకముందే నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

    వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచే వాతావరణం మామిడి రైతులకు అనుకూలంగా లేదు. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండటం, వడగళ్ల వానలతో మామిడి కాయలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో ఆ కాయలకు ధర రాని పరిస్థితి నెలకొంది.

    మామిడి

    మార్కెట్లో కొనే దిక్కులేక దళారులను ఆశ్రయిన్న మామిడి రైతులు

    మామిడి కాయలను మే ప్రారంభంలో తెంపుతారు. ఆ సమయానికి అవి మంచి పరిణామంలో ఉంటాయి. అమ్మినా మంచి ధర పలుకుతాయి.

    అకాల వర్షాల కారణంగా మామిడి కాయలు నిర్ణీత సమయం కంటే ముందే నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మే నెల ప్రారంభంలో తెంపే మామిడి కాయలు 500 గ్రాముల నుంచి కిలో బరువు వరకు ఉంటాయి.

    వర్షాల కారణంగా నేల రాలిన కాయలు 250గ్రాములకు మించి లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

    బరువు లేని కాయలను మార్కెట్లో ఎవరూ కొనరు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి, తక్కువ ధరకు పంటను విక్రయిస్తున్న పరిస్థితి నెలకొంది.

    దీంతో పెట్టిన పెట్టుబడి ఏమో కానీ, రవాణా ఖర్చులు కూడా రావడం కష్టమని రైతులు వాపోతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    తెలంగాణ

    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్
    జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య జనగామ
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం జైపూర్
    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్

    ఆంధ్రప్రదేశ్

    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్
    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం రైల్వే శాఖ మంత్రి
    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? శ్రీరామ నవమి
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తాజా వార్తలు

    బెంగళూరు-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే రూట్ ఖారారు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025