NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
    తదుపరి వార్తా కథనం
    Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు
    Special Cards For Farmers For Implementation Of Government Schemes

    Farmers: రైతులకు ఆధార్‌ తరహా కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 10, 2024
    11:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని రైతుల కోసం పథకాల సమర్థవంతమైన అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయడానికి సన్నాహాలు చేపట్టింది.

    ఈ క్రమంలో రైతుల నమోదు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నది. అందులో భాగంగా, అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల నమోదు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

    రైతుల నమోదు గురించి అవగాహన పెంచి, అన్ని శాఖల సమన్వయంతో ఈ నమోదు ప్రక్రియను నిర్వహించడానికి ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను (PMUs) ఏర్పాటు చేయాలని సూచనలు ఇవ్వబడ్డాయి.

    ప్రస్తుతం 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి, అందులో తెలంగాణ కూడా ఒకటి.

    వివరాలు 

     PMUలను ఏర్పాటుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

    కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం PMUలను ఏర్పాటుచేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ PMUకు వ్యవసాయ సంచాలకుడు B. గోపి అధిపతిగా,సీసీఏల్ఏ కార్యదర్శి మంద మరకందు, ఐటీ శాఖ ఉప కార్యదర్శి భవేశ్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు V. సర్వేశ్వర్ రెడ్డి, ఐటీ శాఖ సీనియర్ సంచాలకుడు రాధాకృష్ణలను సభ్యులుగా నియమించింది.

    ఈ PMU ఇప్పుడు రైతుల సమాచారం సేకరించడానికి సంబంధిత విధివిధానాలను రూపొందించి, వాటిని అమలు చేయనుంది.

    కేంద్రం ఇటీవల దేశవ్యాప్తంగా రైతుల కోసం పథకాల అమలులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తించింది.

    వారి కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేసి, వాటిని వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

    వివరాలు 

    వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం రూ.2,817 కోట్లు 

    దీనివల్ల రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలవుతుందని కేంద్రం ఆశిస్తోంది.

    2024-25 బడ్జెట్‌లో వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం కేంద్రం రూ.2,817 కోట్లను కేటాయించింది.

    ఈ ప్రాజెక్టు క్రింద ప్రత్యేక గుర్తింపు కార్డుల జారీకి కావలసిన అన్ని వివరాలను సేకరించి నమోదు చేయాలని నిర్ణయించారు.

    ప్రస్తుతం, దేశంలోని అన్ని రాష్ట్రాల భూములు, పంటల వివరాలు కేంద్రానికి అందిస్తున్నాయి, అయితే రైతుల పంటలు, పశుసంపద మొదలైన ఇతర సమాచారం ఇంకా అందలేదు.

    కొత్తగా చేపట్టే నమోదు ప్రక్రియ ద్వారా అన్ని రకాల సమాచారం అందుబాటులోకి రాబోతున్నట్లు కేంద్రం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    తెలంగాణ

    తాజా

    Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్
    Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి! కోవిడ్
    NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..? జూనియర్ ఎన్టీఆర్

    కేంద్ర ప్రభుత్వం

    NPS Vatsalya :  'ఎన్‌పీఎస్ వాత్సల్య' ప్రారంభం.. అర్హతలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోండి! నిర్మలా సీతారామన్
    EY Employee Death: పని ఒత్తిడి కారణంగా 26 ఏళ్ల ఉద్యోగి మృతి.. విచారణ జరపనున్న కేంద్రం భారతదేశం
    Vivad Se Vishwas 2.0: అక్టోబర్‌ 1 నుంచి వివాద్‌ సే విశ్వాస్‌ 2.0.. నోటిఫై చేసిన కేంద్రం నిర్మలా సీతారామన్
    Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు.. ఆంధ్రప్రదేశ్

    తెలంగాణ

    Telangana: నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్‌పాయిజన్‌.. 21 మందికి అస్వస్థత భారతదేశం
    Musi River: మూసీ నది ప్రక్షాళన.. హైకోర్టు కీలక ఆదేశాలు  హైకోర్టు
    Telangana Tourism: తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్.. 34 జలవనరుల్లో స్పీడ్, హౌస్‌బోట్లు భారతదేశం
    Medaram: మేడారం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు.. ప్రత్యేకంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్  మేడారం జాతర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025