NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
    తదుపరి వార్తా కథనం
    Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
    తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి

    Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2023
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు.

    ప్రభావిత జిల్లాల్లో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తప్పుడు అంచనాలు వేసిందని చీఫ్ సెక్రటరీ చెప్పారు.

    తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా 10 మంది చనిపోగా, గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో కొందరు మరణించారని చీఫ్ సెక్రటరీ తెలిపారు.

    దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునల్వేలి,టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలు నమోదయ్యాయి.

    Details 

    రెస్క్యూ,రిలీఫ్ ఆపరేషన్‌లో 1,343 మంది

    నేవీ, ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో సహా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన దాదాపు 1,343 మంది సిబ్బంది రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

    ఇప్పటి వరకు 160 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చెయ్యగా, దాదాపు 17,000 మందిని ఈ రిలీఫ్ క్యాంపుల్లో ఉంచారు.

    దాదాపు 34 వేల ఫుడ్ ప్యాకెట్లను ప్రజలకు సరఫరా చేశారు. ఇప్పుడు కూడా నీటి మట్టం తగ్గకపోవడంతో అధికారులు కొన్ని గ్రామాలకు చేరుకోలేకపోతున్నామని చీఫ్ సెక్రటరీ చెప్పారు.

    తొమ్మిది హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి, వాటి ద్వారా 13,500 కిలోల ఆహారాన్ని ఒంటరిగా ఉన్న బాధితులకు సరఫరా చేశారు.

    Details 

    పాఠశాలలు, కళాశాలలకు సెలవు

    భాధిత ప్రజలకు నిత్యావసరాల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తిరునెల్వేలిలో 64,900 లీటర్లు,టుటికోరిన్‌లో 30,000 లీటర్లు పాలను సరఫరా చేశామన్నారు.

    స్థానిక మత్స్యకారుల సహకారంతో దాదాపు 323 పడవలు చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు రంగంలోకి దింపామని,పొరుగు జిల్లాల నుంచి మరికొంత మంది సిబ్బందిని సహాయక చర్యలకు రప్పిస్తామని చెప్పారు.

    భారీ వర్షాల దృష్ట్యా తిరునెల్వేలి, టెన్'కాశి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అదేవిధంగా తుత్తుకుడి జిల్లాకు కూడా సెలవు ప్రకటించారు.

    ఈ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా బుధవారం కూడా రైళ్ల రాకపోకలు దెబ్బతిన్నాయి. దక్షిణ రైల్వే రద్దు చేసిన/పాక్షికంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను విడుదల చేసింది.

    ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్ శ్రీవైకుంటం చేరుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    భారీ వర్షాలు
    వరదలు

    తాజా

    MI vs DC: వర్షం కురిసే అవకాశం.. ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌పై ఉత్కంఠ ముంబయి ఇండియన్స్
    Tamil Nadu: విద్య నిధులను నిలిపివేసినందుకు.. కేంద్రంపై మరోసారి సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం.. తమిళనాడు
    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా

    తమిళనాడు

    Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్  మమతా బెనర్జీ
    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొన్న వ్యాన్..ఆరుగురు మృతి  రోడ్డు ప్రమాదం
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సనాతన కుల వివక్షే: ఉదయనిధి స్టాలిన్  ఉదయనిధి స్టాలిన్
    ఉదయనిధి స్టాలిన్ సనాతన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ.. కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం ప్రధాన మంత్రి

    భారీ వర్షాలు

    Heavy Rain in Delhi: దిల్లీలో భారీ వర్షం; రోడ్లన్నీ జలమయం  దిల్లీ
    భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం  హిమాచల్ ప్రదేశ్
    Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  హిమాచల్ ప్రదేశ్
    హిల్లరీ తుఫాను బీభత్సం; బాజా వద్ద తీరం దాటిన సైక్లోన్.. కాలిఫోర్నియా వైపు పయనం  తుపాను

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025